Telangana

ఇష్టపడి చదవండి.. ఉన్నత శిఖరాలను అధిరోహించండి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం,మనవార్తలు ప్రతినిధి :

కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీ గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలను సోమవారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు ప్రాంతంలోని నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో 17 సంవత్సరాల క్రితం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సహాయ సహకారాలతో భూపాల్ రెడ్డి ఈ కళాశాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల అయినప్పటికిని కళాశాల అభివృద్ధికి అనునిత్యం అండగా నిలుస్తూ విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో భూపాల్ రెడ్డి పాత్ర ప్రశంసనీయమన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తుందని, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అన్ని మౌలిక వసతులు కల్పిస్తుందని అన్నారు. శ్రద్ధసక్తులతో చదివి తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కళాశాల విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన సంస్కృతి కార్యక్రమాలు అందరిని అల్లరించాయి. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు సోమిరెడ్డి, పరమేష్, కుమార్ గౌడ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago