మనవార్తలు ,పటాన్ చెరు:
రాబోయే వినాయక చవితిని పురస్కరించుకుని ప్రజలందరూ మట్టి వినాయకులను పూజించే లా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని మహంకాళి దేవాలయం లో మట్టి వినాయకుడి ప్రతిమ ను ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల అందరికీ అవగాహన కల్పించేలా ఈ ప్రతిమను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు వివిధ రసాయనాలతో తయారుచేసిన ప్రతిమలను చెరువులు, కుంటల లో నిమజ్జనం చేసిన అనంతరం కాలుష్యం ఏర్పడి పర్యావరణానికి పెను ప్రమాదంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసే వారిని ప్రోత్సహించడం తో పాటు, అందరికీ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. ప్రజలందరూ మట్టి వినాయకుడి ప్రతిమలు పూజించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, పట్టణ ప్రముఖులు సపాన దేవ్, తులసి దాస్, మాణిక్ ప్రభు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…
శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…