మనవార్తలు ,పటాన్ చెరు:
రాబోయే వినాయక చవితిని పురస్కరించుకుని ప్రజలందరూ మట్టి వినాయకులను పూజించే లా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని మహంకాళి దేవాలయం లో మట్టి వినాయకుడి ప్రతిమ ను ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల అందరికీ అవగాహన కల్పించేలా ఈ ప్రతిమను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు వివిధ రసాయనాలతో తయారుచేసిన ప్రతిమలను చెరువులు, కుంటల లో నిమజ్జనం చేసిన అనంతరం కాలుష్యం ఏర్పడి పర్యావరణానికి పెను ప్రమాదంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసే వారిని ప్రోత్సహించడం తో పాటు, అందరికీ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. ప్రజలందరూ మట్టి వినాయకుడి ప్రతిమలు పూజించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, పట్టణ ప్రముఖులు సపాన దేవ్, తులసి దాస్, మాణిక్ ప్రభు, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…