బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :
ఆదర్శమూర్తి మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవాలని బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి గారు పిలుపునిచ్చారు. బుధవారం మహాత్మా గాంధీ గారి 155’వ జయంతి వేడుకల సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని బీ.సీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్ముడి విగ్రహానికి కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి స్థానికులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అహింసా మార్గంలో నడుస్తూ శాంతి స్థాపనకు కృషి చేయాలని కోరారు. అదే మహాత్ముడికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. దేశం గురించి గాంధీజీ కన్న కలల సాకారం కోసం మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి , వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి , కౌన్సిలర్లు గోపాలమ్మ , చంద్రయ్య , నర్సింహా రాజు , స్థానిక నాయకులు సంపత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి , రాష్ట్ర కార్మిక నాయకులు వి.వరప్రసాద్ రెడ్డి , వెంకటయ్య, రమేష్ రెడ్డి , రాజ్ గోపాల్, యువజన నాయకులు బషీర్ , కాలనీ వాసులు విశ్వనాధ్ , శ్రీనివాస్ , బీరప్ప భాను , స్వామి , విజయ్ , వెంకటేష్ , తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…