బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :
ఆదర్శమూర్తి మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవాలని బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి గారు పిలుపునిచ్చారు. బుధవారం మహాత్మా గాంధీ గారి 155’వ జయంతి వేడుకల సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని బీ.సీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్ముడి విగ్రహానికి కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి స్థానికులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అహింసా మార్గంలో నడుస్తూ శాంతి స్థాపనకు కృషి చేయాలని కోరారు. అదే మహాత్ముడికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. దేశం గురించి గాంధీజీ కన్న కలల సాకారం కోసం మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి , వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి , కౌన్సిలర్లు గోపాలమ్మ , చంద్రయ్య , నర్సింహా రాజు , స్థానిక నాయకులు సంపత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి , రాష్ట్ర కార్మిక నాయకులు వి.వరప్రసాద్ రెడ్డి , వెంకటయ్య, రమేష్ రెడ్డి , రాజ్ గోపాల్, యువజన నాయకులు బషీర్ , కాలనీ వాసులు విశ్వనాధ్ , శ్రీనివాస్ , బీరప్ప భాను , స్వామి , విజయ్ , వెంకటేష్ , తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…