_సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం తో నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీళ్లు
_పటాన్చెరు నియోజకవర్గం టార్గెట్ పదివేలు
మనవార్తలు , పటాన్ చెరు:
ఈనెల 21వ తేదీన నారాయణఖేడ్ లో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు పటాన్చెరు నియోజకవర్గం నుండి పదివేల మంది కార్యకర్తలు తరలి రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని తెలిపారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తయితే నాలుగు లక్షల ఎకరాల భూములు సాగులోకి వస్తాయని తెలిపారు. నారాయణఖేడ్ లో నిర్వహించబోయే సభకు పటాన్చెరు నియోజకవర్గం నుండి పదివేల మందిని జనసమీకరణ చేయాలని కోరారు. గ్రామస్థాయి నుండి నియోజక స్థాయి వరకు గల ప్రతినాయకుడు బాధ్యత తీసుకొని సభ విజయవంతానికి కృషి చేయాలని ఆయన కోరారు. మధ్యాహ్నం 1:00 లోపు ప్రతి ఒక్కరు సభా ప్రాంగణానికి చేరుకోవాలని, ఇందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…