Districts

నారాయణఖేడ్ సభను విజయవంతం చేద్దాం_రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

_సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం తో నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీళ్లు

_పటాన్చెరు నియోజకవర్గం టార్గెట్ పదివేలు

మనవార్తలు , పటాన్ చెరు:

ఈనెల 21వ తేదీన నారాయణఖేడ్ లో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు పటాన్చెరు నియోజకవర్గం నుండి పదివేల మంది కార్యకర్తలు తరలి రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని తెలిపారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తయితే నాలుగు లక్షల ఎకరాల భూములు సాగులోకి వస్తాయని తెలిపారు. నారాయణఖేడ్ లో నిర్వహించబోయే సభకు పటాన్చెరు నియోజకవర్గం నుండి పదివేల మందిని జనసమీకరణ చేయాలని కోరారు. గ్రామస్థాయి నుండి నియోజక స్థాయి వరకు గల ప్రతినాయకుడు బాధ్యత తీసుకొని సభ విజయవంతానికి కృషి చేయాలని ఆయన కోరారు. మధ్యాహ్నం 1:00 లోపు ప్రతి ఒక్కరు సభా ప్రాంగణానికి చేరుకోవాలని, ఇందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు.

 

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago