Telangana

ప్రతి పల్లెను ప్రగతికి తార్కానంగా తీర్చిదిద్దాం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు

_తాజా మాజీ సర్పంచులకు ఘన సత్కారం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ప్రజాస్వామ్యంలో పదవులు అత్యంత బాధ్యతతో కూడుకున్నవని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే ప్రజల ఆశీర్వాదం పొందవచ్చని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో.. తాజా మాజీ సర్పంచులకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్భంచులను శాలువా, మేమొంటో తో సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో ఐదు సంవత్సరాల పాటు గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఐదు, ఆరు నెలల పాటు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని, అప్పటివరకు గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి బాధ్యతతో పనిచేయాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ది కాలంలో ప్రతి పల్లెను ప్రగతికి ప్రతీకగా తీర్చిదిద్దామని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా జనాభా సంఖ్య కు అనుగుణంగా ప్రతినెల నిధులు విడుదల చేస్తూ మౌలిక కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా జాతీయస్థాయి అవార్డులు సైతం తెలంగాణ పల్లెలు అందుకున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు దేవానందం, సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పిటిసిలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

1 day ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

1 day ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

1 day ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

2 days ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

2 days ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago