Telangana

ఆక్రమణకు గురవుతున్న సొసైటీ స్థలం

_ధ్వంసమైన క్రీడా ప్రాంగణం

– చర్యలు తీసుకోవడంలో విఫలమైన జిహెచ్ఎంసి అధికారులు.

_సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

చిన్నారుల ఆహ్లాదం కోసం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన క్రీడా ప్రాంగణం పూర్తిగా ధ్వంసం అయింది. క్రీడా ప్రాంగణానికి ఆనుకొని జరుగుతున్న ఓ నిర్మాణ వ్యర్ధాలను, సామాగ్రిని క్రీడా ప్రాంగణంలో వేయడంతో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. నిత్యం ప్రజాప్రతినిధులు, జిహెచ్ఎంసి అధికారులు సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఖరీదైన సొసైటీ స్థలం అన్యాక్రాంతం అవుతున్న కోట్ల రూపాయల విలువ చేసే స్థలం కబ్జాకు గురవుతున్నా అధికారులు గాని, సొసైటీ సభ్యులు గాని చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గల పాత ఎం. ఐ. జి కాలనిలో గతం లో చిన్నపిల్లలు  స్థానిక టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు సంబంధించిన నిర్మాణం కావడంతోనే సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు వెనకడుగు వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో కోటిన్నర విలువచేసే ఖరీదైన స్థలం కబ్జా అవుతున్నా సొసైటీ సభ్యులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పార్కులో ఏర్పాటు చేసిన క్రీడా సామాగ్రి పూర్తిగా ద్వoసమవడంతో చిన్నారులకు క్రీడా ప్రాంగణం కరువైందని చుట్టుపక్కల వారు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటు జి. హెచ్. ఎం. సి. అధికారులు గాని, సొసైటీ సభ్యులు గాని ఎందుకు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago