Hyderabad

బీజేపీ ని బలోపేతం చేయడానికి సమిష్టిగా కృషి చేద్దాం – బీజేపీ నేతలు

మనవార్తలు , శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తాండ లో బీజేపీ సీనియర్ నాయకులు మొవ్వా సత్యనారాయణ, రవికుమార్ యాదవ్, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ల ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషికి చిహ్నంగా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముందుగా సేవాలాల్ మహారాజ్ గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉందని రాబోయే రోజుల్లో కాషాయ జెండా ఎగర వేయడం తధ్యమని తెలియజేస్తూ, నేటి తెలంగాణ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు భూ కబ్జాలకు పాల్పడుతూ ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.నాయకులు ,కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని సూచించారు.మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ మనమంతా గ్ర ఒకటే గ్రూప్ గా ఉంటూ ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని తెలిపారు.

అదేవిధంగా కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నడిగడ్డ తాండ బిజెపి అడ్డా మనమంతా బేధాభిప్రాయాలు పక్కన పెట్టి ఎలాంటి భేషజాలకు పోకుండా ముందుకు పోతూ ప్రతి ఒక్కరు పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు డి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, రాఘవేంద్రరావు, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, వినయ్, త్రినాథ్, మదనాచారి, జంగయ్య యాదవ్ , హరికృష్ణ, లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీశైలం కురుమ, గణేష్ ముదిరాజ్, హరిప్రియ, స్వప్న రెడ్డి, వినోద్ యాదవ్ , ఆంజనేయులు, చందు, మధు యాదవ్ , శివరాజ్, శ్రీను జె, రాము, రాజ్, జైశ్వాల్ తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

11 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

11 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

11 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

11 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

11 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago