Telangana

ఐక్యంగా ఉందాం.. సమస్యలను పరిష్కరించుకుందాంటీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనాథ్

* జర్నలిస్టుల సమస్యలపై సమష్టి పోరాటం అవసరం

* నేడు పటాన్‌చెరు నియోజకవర్గస్థాయి సమావేశం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

జర్నలిస్టులందరం ఐక్యంగా ఉండి తమ సమస్యలను సమష్టిగా పరిష్కరించుకుందామని టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనాథ్ పిలుపునిచ్చారు. సోమవారం రామచంద్రాపురం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 11న రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో పటాన్‌చెరు నియోజకవర్గస్థాయి జర్నలిస్టుల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఏ.కె.ఫైజల్ హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని శ్రీనాథ్ తెలిపారు. అలాగే పటాన్‌చెరు నియోజకవర్గస్థాయి కమిటీని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు బండారు యాదగిరి, రాష్ట్ర అడహక్ కమిటీ సభ్యులు అబ్దుల్ బాసిత్, జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్ కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆసిఫ్, ప్రధాన కార్యదర్శి చెన్న బసవేశ్వర్ తో పాటు జిల్లా కమిటీ సభ్యులు హాజరవుతారని తెలిపారు.జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని శ్రీనాథ్ కోరారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago