Telangana

నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియః ఎసిఎస్ శాస్త్రవేత్త

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని, ముఖ్యంగా సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలని, టీసీఎస్ పూర్వ ఉపాధ్యక్షుడు, ముఖ్య శాస్త్రవేత్త నారాయణ జీసీఎల్ (నుండలీక) అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో, ఐ ట్రిపుల్ ఈ విద్యార్థి విభాగం సౌజన్యంతో ‘టెక్ఆక్వినాక్స్’ పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల టీ హ్యాకథాన్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. అందులో ముఖ్య అథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సృజనాత్మకతకు ఈ ప్రపంచంలో ప్రత్యామ్నాయం.లేదన్నారు. జీవితాంతం నేర్చుకోవడం, సృజనాత్మకంగా యోచన, క్లిష్టమైన ఆలోచన, సానుభూతితో సందర్భాను సారం వ్యవహరించడం, వ్యవస్థాపకత వంటి లక్షణాలను ప్రతి విద్యార్థి అలవరచుకోవాలని సూచించారు. ప్రస్తుతం హెట్రిక్, హెటచ్, హెక్టాన్సెప్ట్ విధానం కొనసాగుతోందని, విద్యార్థులు అందుకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఆందోళనకూ తావుండదని ఆయన స్పష్టీకరించారు.

నీ విద్యార్థి అయినా ఒక సవాలును ఎదుర్కునేటప్పుడు, ఆ సమస్యను స్పష్టంగా నిర్వచించాలని, అది ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందో గ్రహించాలని, దానికి ఇతరుల కంటే మెరుగైన పరిష్కారాన్ని సూచించగలగాలని, నారాయణ సూచించారు. అలాగే నునం రూపొందించిన అంశాన్ని ఇతరులకు అర్థమయ్యేలా వివరించాలని, సమష్టి, కృషిని నొక్కిచెప్పాలని, పీలెనంత వరకు దానిని సచిత్రంగా వివరించడం మంచిదన్నారు.సభాధ్యక్షత వహించిన స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య -మాట్లాడుతూ, ఈ 30 గంటల హ్యాకథాన్లో పాల్గొనే వారంతా, దానిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రమాదాల:: విచారణకు మోటార్ సెక్షిల్ వేగాన్ని తల్లిదండ్రులు నియంత్రించ గలిగే ఆవిష్కరణ చేయాలని సూచించారు.తొలుత, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి. మాధవి మాట్లాడుతూ, జంట నగరాల చుట్టుపక్కల నుంచి దాదాపు 15 కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు చెప్పారు. ఐ ట్రిపుల్ ఈ విద్యార్థి. విభాగం కౌన్సెలర్ డాక్టర్ ప్రశాంత ఆర్.ముదిమెల తన స్వాగతోపన్యాసంలో, తాము ఇచ్చి పలు అంశాలకు సంబంధించిన 23 ఎంట్రీలు వచ్చినట్టు చెప్పారు.

admin

Recent Posts

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

19 hours ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

19 hours ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

19 hours ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

19 hours ago

నూతన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించండి

అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…

1 day ago

ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…

2 days ago