Hyderabad

కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఆరంభం – ప్రారంభోపన్యాసం చేసిన గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్

పటాన్‌చెరు:

కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) ని ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ ఘనంగా ప్రారంభించారు. విధాన నిర్ణేతలకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, దార్శనికతలను అందించాలనే లక్ష్యంతో దీనిని నెలకొల్పారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ తన బాల్యం నుంచి ఓ ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు అధ్యక్షుడిగా ఎదిగే వరకు జరిగిన ముఖ్య పరిణామాలు, ఎదుర్కొన్న సవాళ్ళను వివరించారు. విద్యార్థులు, అధ్యాపకులు సంధించిన పలు ప్రశ్నలకు సమయస్ఫూర్తితో యుక్తిగా జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. విధానం, ప్రణాళిక అనే అంశాలపై గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ సవివరంగా ప్రసంగించారు.

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే వరకు నెహ్రూ విధానాలే అమలు జరిగాయన్నారు. పంచవర్ష ప్రణాళికలలో అభివృద్ధిని లక్ష్మీస్తూ నీటిపారుదల, పరిశ్రమలు, విద్య వంటి రంగాల ఉన్నతికి బాటలు వేసినట్టు చెప్పారు. దురదృష్టవశాత్తూ వినూత్న ఆలోచనలల్లో మనం వెనుకంజ వేశామని, ఇకపై మనమంతా వస్తూత్పత్తి పరిశోధనలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. విధాన నిర్ణేతల కోసం గీతం వైపు చూసే రోజు భవిష్యత్తులో వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

కేఎస్ పీపీ డీన్, పూర్వ ఐఎస్ అధికారి, ఐక్యరాజ్య సమితిలో భారతీయ శాశ్వత ప్రతినిధిగా పనిచేసిన సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ అవరోధాలను గుర్తెరిగి వాటిని అధిగమించడం, విధాన నిర్ణయాలేమిటో అర్థం చేసుకోవడాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. కౌటిల్యా గురించి: హైదరాబాద్ లోని అత్యాధునిక పబ్లిక్ పాలసీ స్కూలుగా పేరొందిన కేఎస్ పీపీని 2020 లో స్థాపించగా, ఇది భారతీయ నైతికత, సంస్కృతి, విలువలను పాశ్చాత్య ప్రజా విధాన చట్రాలతో మిళితం చేస్తుంది. విశ్వవ్యాప్తంగా ఉన్న ఐవీ లీగ్ విధాన పాఠశాలల తరహాలో జ్ఞానాన్ని వృద్ధిచేసే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. రెండేళ్ళ నిడివి గల మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీని కోర్సును రెసిడెన్షియన్ విధానంలో నిర్వహిస్తోంది. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చే విద్యార్థులను ఒకచోట చేర్చి వారిని విధాన నిర్ణేతలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago