పటాన్చెరు:
కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) ని ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ ఘనంగా ప్రారంభించారు. విధాన నిర్ణేతలకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, దార్శనికతలను అందించాలనే లక్ష్యంతో దీనిని నెలకొల్పారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ తన బాల్యం నుంచి ఓ ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు అధ్యక్షుడిగా ఎదిగే వరకు జరిగిన ముఖ్య పరిణామాలు, ఎదుర్కొన్న సవాళ్ళను వివరించారు. విద్యార్థులు, అధ్యాపకులు సంధించిన పలు ప్రశ్నలకు సమయస్ఫూర్తితో యుక్తిగా జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. విధానం, ప్రణాళిక అనే అంశాలపై గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ సవివరంగా ప్రసంగించారు.
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే వరకు నెహ్రూ విధానాలే అమలు జరిగాయన్నారు. పంచవర్ష ప్రణాళికలలో అభివృద్ధిని లక్ష్మీస్తూ నీటిపారుదల, పరిశ్రమలు, విద్య వంటి రంగాల ఉన్నతికి బాటలు వేసినట్టు చెప్పారు. దురదృష్టవశాత్తూ వినూత్న ఆలోచనలల్లో మనం వెనుకంజ వేశామని, ఇకపై మనమంతా వస్తూత్పత్తి పరిశోధనలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. విధాన నిర్ణేతల కోసం గీతం వైపు చూసే రోజు భవిష్యత్తులో వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…