పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మన సంస్కృతితో భాషకు దగ్గర అనుబంధం ఉందని, సాంస్కృతిక సహనం కూడా భాషతో ముడిపడి ఉంటుందని ఇంటి హెదరాబాద్లోని జాతీయ పోస్ట్ డాక్టరల్ ఫెలో డాక్టర్ వి.కీర్తన కపిలే అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లోని మనస్తత్వశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘పరాన్నజీవి: భాష, జ్ఞానం’ అనే అంశంపై ఆమె బుధవారం అతిథ్య ఉపన్యాసం చేశారు.మనం మాట్లాడదలచుకున్నప్పుడు, ముందుగా, నిరుటివారి మానసిక స్థితిని అర్థం చేసుకోవాలని, వారుపరధ్యానంగా ఉండకుండా చూసుకోవాలని, వారితో స్పష్టమైన సాన్నిహిత్యం కలిగి ఉండాలని, సూటిగా మాట్లాడాలని,ఆమె సూచించారు.
అప్పుడు మనం చెప్పేది ఎదుటి వారు అర్థం చేసుకుని ప్రతిస్పందిస్తారని, మన చర్యకు ప్రతిచర్యఉంటుందన్నారు.ఇలా చేయడం వల్ల మనం చెబుతోంది వినేవారికి ఒకరకమైన మానసిక అవగాహన ఏర్పడుతుందని, ఆ తరువాత దానిఫలితాలు సహజంగానే వస్తాయన్నారు.మాతృ భాష అనేది సహజసిద్ధంగానే అలవడుతుందని, ద్వితీయ లేదా సర భాషను నేర్చుకోవడానికి: సామాజిక జ్ఞానాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని డాక్టర్ కీర్తన స్పష్టీకరించారు. పరుష వచనాలు లేదా దుర్భాషలను మాతృ భాషలో మాట్లాడినంత సులువుగా పర భాషలో మాట్లాడలేనున్నారు. ఈ సందర్భంగా మనస్తత్వశాస్త్ర విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సందర్భోచిత జవాబులిచ్చి ఆకట్టుకున్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…