Telangana

ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమం

మన వార్తలు, శేరిలింగంపల్లి :

ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం రోజు హైదరాబాదులో గన్ పార్క్ దగ్గర జరిగిన కార్యక్రమంలో, తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాలపై ముదిరాజ్ చైతన్య వేదిక “లక్ష పోస్ట్ కార్డుల” ఉద్యమానికి తెర లేపింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర నాయకులు శివ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణలో అతి త్వరలో జరుగబోయే ఎన్నికల్లో, తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు 15 ఎమ్మెల్యే టిక్కెట్లను, ఎమ్మెల్సీ, ఎంపీ స్థానాలతో పాటు నామ టికెట్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముదిరాజు ల రిజర్వేషన్ సమస్యలను పరిష్కరించాలని, అందుకోసమే ఈ లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు రాసి ముదిరాజ్ ల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే దిశగా ఈ ఉద్యమం సాగుతుందని, ముదిరాజ్ మహిళ రాష్ట్ర నాయకురాలు కోట్ల పుష్పలత ముదిరాజ్ పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో రాజకీయ పార్టీలకు, సంఘాలకు, ప్రాంతాలకు అతీతంగా పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రంలో ఉన్న ముదిరాజు లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్, కురుమూర్తి, నర్సింహా, సీతా మహాలక్ష్మి, సురేష్, వేంకటేశ,మహేష్, రాకేష్, జగదీష్ , కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పటాన్చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి సహకరించండి

తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…

13 hours ago

ఇష్టపడి చదవండి లక్ష్యాన్ని సాధించండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…

13 hours ago

గీతంలో ప్రమాణ కోసం సర్వం సిద్ధం

ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…

14 hours ago

ప్రభుత్వ భూములను కాపాడాలి

అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…

14 hours ago

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

2 days ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

2 days ago