Telangana

పది ఫలితాలలో సత్తా చాటిన కృష్ణవేణి హై స్కూల్ ముత్తంగి విద్యార్థులు

– 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు

అభినందించి సత్కరించిన కృష్ణవేణి విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పది ఫలితాలలో మండలంలోని ముత్తంగి కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. గత నెల 30న వెల్లడించిన పదవ తరగతి ఫలితాల్లో మండలంలోని ముత్తంగి గ్రామంలోని కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు 40 మందికి పైగా 500 పైగా నే మార్కులు సాధించడంతోపాటు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎన్నపు జోష్న (577) పాఠశాల టాపర్ గా నిలువగా, బొర్రా లాస్య (567) తెర్లి వర్షిని (563) మంత్రి కార్తిక (568)(557)బొడ్డేపల్లి జోత్స్న(556) పడాల విశ్వాంత్(555) నాయక్ వాడి విద్యాసాగర్ (550) మార్కులు సాధించి తమ సత్తా చాటారు. గురువారం రాత్రి పాఠశాలలో ప్రిన్సిపల్ రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో కృష్ణవేణి, మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని టాపర్ గండించిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను అభినందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజు సంగాని మాట్లాడుతూ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు చే బోధించడంతోనే ఇది సాధ్యమని అదే కాక విద్యార్థులు సైతం కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి మంచి మార్కులు సాధించడం పట్ల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ప్రిన్సిపల్ రాజేష్ మాట్లాడుతూ 82 మంది విద్యార్థులు 10 పరీక్షలు వ్రాయగా అందులో 40 మంది విద్యార్థులు 500 లకు పైగా మార్కులు సాధించి 100 శాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. పాఠశాల అత్యుత్తమ విద్య ప్రమాణాలు పాటించడం వల్లనే ఈ విజయం కృష్ణవేణి వశమైందన్నారు. విద్యార్థులను ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేయడంతో పాటు ఇంటి వద్ద వారి తల్లిదండ్రులు సైతం ప్రత్యేక శ్రద్ధ కనపరచడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago