Telangana

పేలుడు పదార్థాలు, పేల్చే పద్ధతులపై అవగాహన

రెండు రోజుల సాంకేతికత మార్పిడి కార్యక్రమంలో వక్తలుగా పరిశ్రమ-విద్యా నిపుణులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘గనులు-క్వారీ పరిశ్రమ కోసం మౌలిక సదుపాయాలు, పేలుడు పదార్థాలు, పేల్చే పద్ధతుల’పై మే 9-10 తేదీలలో రెండు రోజుల సాంకేతికత మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పేలుడు సాంకేతికతలో పురోగతులు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడానికి పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలు, నిపుణులను ఒకచోట చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.ప్రాజెక్టు మేనేజర్లు, బ్లాస్టింగ్ ఇంజనీర్లు, నియంత్రణ సంస్థలు, అమలు చేసే ఏజెన్సీలు, తవ్వకం కాంట్రాక్టర్లు, పేలుడు పదార్థాల తయారీదారులు, ఇన్ స్ట్రుమెంటేషన్ నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులు తదితరులు జ్జానాన్ని మార్పిడి చేసుకోవడానికి, అనుభవాలను పంచుకోవడానికి, భారతీయ పరిశ్రమలో బ్లాస్టింగ్ టెక్నిక్ లను మెరుగుపరచడంపై వ్యూహరచన చేయడానికి ఒక ప్రత్యేక వేదికగా ఈ కార్యక్రమం తోడ్పడనుందన్నారు.

బ్లాస్ట్ డిజైన్, ఫలితాలలో భూగర్భ శాస్త్రం పాత్ర; పేలుడు పదార్థాలు, ప్రారంభ పరికరాలలో పురోగతి; ఉపరితరం-భూగర్శ తవ్వకాల కోసం బ్లాస్ట్ డిజైన్; బ్లాస్ట్ ఫలితాల అంచనా; బ్లాస్టింగ్-ఉపశమన వ్యూహాల యొక్క పర్యావరణ ప్రభావాలు; బ్లాస్ట్ నష్టం- ముందస్తు అంచనా-నియంత్రణ చర్యలు; నీటి కింద బ్లాస్టింగ్ టెక్నాలజీ; పట్టణ వాతావరణంలో బ్లాస్టింగ్ పద్ధతులు అనే అంశాలపై ఈ నిపుణుల మార్గదర్శనం ఉంటుందని వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత నిపుణులు రిసోర్స్ పర్సన్లుగా పాల్గొంటారని, వారిలో గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వేదాల రామ శాస్త్రి; బెంగళూరులోని జాతీయ రాక్ మెకానిక్స్ సంస్థ పూర్వ డైరెక్టర్ డాక్టర్ హెచ్.ఎస్. వెంకటేష్; ఎన్ఐటీ రూర్కెలా ప్రొఫెసర్ సింగం జయంతు; వారణాసిలోని ఐఐటీ-బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సంజయ్ శర్మ; నాగపూర్ లోని సీఎస్ఐఆర్-మైనింగ్-ఇంధన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం. రాములు; నాగపూర్ విశ్వేశ్వరయ్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఎన్.ఆర్. థోటే తదితరులు పాల్గొంటారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం గనులు, క్వారీ పరిశ్రమలలో అత్యాధునిక పరిణామాలపై లోతైన అవగాహన పొందడానికి, బ్లాస్టింగ్ టెక్నాలజీ ఆవిష్కరణల గురించి తెలుసుకోవడానికి ఒక విలువైన అవకాశంగా అభివర్ణించారు.ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు, ఇతర వివరాల కోసం డాక్టర్ జి. జ్యోతికుమారిని 97019 28209ను సంప్రదించాలని, jganta@gitam.eduకు ఈ-మెయిల్ చేయాలని, లేదా వెబ్ లింక్ https://forms.gle/ bcdoyFpJfNLLgj9G6. ను సందర్శించాలని సూచించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago