politics

దేశంలోనే విజన్ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

దేశ్ కీ నేతగా, దేశ రాజకీయాల్లో కీలక ఘట్టాన్ని రూపొందించబోయే మహా నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ,పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో  కేకు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ
కుల, మతాలకు అతీతంగా రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తి కేసీఆర్ అని అన్నారు బీఆర్ఎస్ గా మారాక దేశప్రజలందరూ కేసీఆర్ వైపే చూస్తున్నారని తెలిపారు .తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతుభీమా, రైతుబంధు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి 24 గంటలు కరెంట్ వంటి పథకాలు దేశంలో అమలయ్యేలా చూస్తున్న మహా నాయకుడని అన్నారు. కాళేశ్వరం నీటితో వందల ఎకరాలు సస్యశ్యామలం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి ది అని అన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్క యువత సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేలా చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని అన్నారు దేశానికి ఏం చేస్తారని చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన లో ఎన్నో కష్టాలు కోర్చి ప్రత్యేక తెలంగాణ సాధించారన్నారు. ఈసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని ఆశీర్వదిస్తారని ఆయన తెలిపారు. అనంతరం ఎన్ఎమ్అర్ యువసేన ఆధ్వర్యంలో రక్తదానశిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పొట్టి నారాయణ రెడ్డి,వెంకటేష్,మురళీ, రాజ్ కుమార్,వెంకటేశ్, ఎండీ ఖదీర్, గారెల మల్లేష్, నారబోయిన శీను, సత్య నారాయణ, మన్నేరాములు,గోపాల్,మహేష్,భాస్కర్, శ్రీనివాస్, రాఘవేంద్ర, ఎన్ఎమ్అర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

9 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

9 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

9 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

9 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

9 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago