— అమీన్పూర్ సర్పంచ్గా విశేష సేవలు అందించిన శశికళ యాదవ రెడ్డి
— గత సేవలను కొనియాడిన రాములు
మనవార్తలు ప్రతినిధి , అమీన్ పూర్ :
తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన శశికళ యాదవ రెడ్డి గారిని పటాన్చెరు నియోజకవర్గం స్వేరో నెట్వర్క్ ఇంచార్జ్ కైతలాపురం రాములు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం మర్యాదపూర్వక వాతావరణంలో జరిగింది.ఈ సందర్భంగా కైతలాపురం రాములు మాట్లాడుతూ.. శశికళ యాదవ రెడ్డి ప్రజలతో మమేకమై పనిచేసే నాయకురాలని కొనియాడారు. గతంలో అమీన్పూర్ సర్పంచ్గా రెండు సార్లు బాధ్యతలు నిర్వహించి, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా కూడా సమర్థంగా సేవలందించారని గుర్తుచేశారు.ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకత్వం ఆమెదని తెలిపారు. అలాంటి సేవా భావం కలిగిన నాయకురాలిపై నమ్మకం ఉంచి తెలంగాణ ప్రభుత్వం మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు అప్పగించడం అభినందనీయం అని అన్నారు.ఇకపై కూడా మహిళల సమస్యల పరిష్కారంలో శశికళ యాదవ రెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అనూష, నర్సింగ్ గౌడ్, స్వేరో నెట్వర్క్ సభ్యులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…