— అమీన్పూర్ సర్పంచ్గా విశేష సేవలు అందించిన శశికళ యాదవ రెడ్డి
— గత సేవలను కొనియాడిన రాములు
మనవార్తలు ప్రతినిధి , అమీన్ పూర్ :
తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన శశికళ యాదవ రెడ్డి గారిని పటాన్చెరు నియోజకవర్గం స్వేరో నెట్వర్క్ ఇంచార్జ్ కైతలాపురం రాములు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం మర్యాదపూర్వక వాతావరణంలో జరిగింది.ఈ సందర్భంగా కైతలాపురం రాములు మాట్లాడుతూ.. శశికళ యాదవ రెడ్డి ప్రజలతో మమేకమై పనిచేసే నాయకురాలని కొనియాడారు. గతంలో అమీన్పూర్ సర్పంచ్గా రెండు సార్లు బాధ్యతలు నిర్వహించి, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా కూడా సమర్థంగా సేవలందించారని గుర్తుచేశారు.ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకత్వం ఆమెదని తెలిపారు. అలాంటి సేవా భావం కలిగిన నాయకురాలిపై నమ్మకం ఉంచి తెలంగాణ ప్రభుత్వం మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు అప్పగించడం అభినందనీయం అని అన్నారు.ఇకపై కూడా మహిళల సమస్యల పరిష్కారంలో శశికళ యాదవ రెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అనూష, నర్సింగ్ గౌడ్, స్వేరో నెట్వర్క్ సభ్యులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…