మనవార్తలు ,శేరిలింగంపల్లి :
ఇటీవల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో ఎప్పటి లాగే బీహెచ్ ఈ ఎల్ జ్యోతి విద్యాలయ హై స్కూల్ విద్యార్థులు తమ సత్తా చాటారు. పెరుగుతున్న పోటీని తట్టుకుంటు, వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యాబోధన చేస్తూ అధ్యాపక బృందం విద్యార్థులను చక్కటి మార్గంలో నడిపిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నది జ్యోతి విద్యాలయ హై స్కూల్. సి బి ఎస్ సి సిలబస్ తో, విశాలమైన ప్లే గ్రౌండ్ తో విద్యార్థులకు అన్ని రకాల క్రీడల్లోనూ శిక్షణనిస్తున్నారు. చదువుతో పాటు వివిధ రకాల క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయ పథకాలు సాధించారు. ప్రతీ సంవత్సరం పదోతరగతి ఫలితాల్లో తిరుగులేని విజయడంఖా మోవిస్తూ దూసుకుపోతుంది. ఈ సంవత్సరం మొత్తం 84 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయగా అందులో జి. జయస్వీ, బశిరత్ ఉన్నిసా లు 10 జిపిఏ సాధించారు. నలుగురు విద్యార్థులు 9.8, ముగ్గురు 9.7, ఐదుగురు 9.5, ముగ్గురు 9.2, నలుగురు 9.0 జిపిఏ సాధించి విజయడంఖా మోగించారు. అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదు అన్నట్లు విజయం సాధించారు. ఇదే ఉత్సాహం తో ముందు ముందు మరిన్ని విజయాలు సాధిస్తామని ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరీ తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…