Telangana

గీతంకు ఐటీసీ ప్రశంస

పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రశంసా పత్రం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

‘చెత్త నుంచి సంపద పేరిట’ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ చేపట్టిన పర్యావరణ హిత చర్యలను ప్రశంసిస్తూ ప్రముఖ బహుళజాతి కంపెనీ ఐటీసీ లిమిటెడ్ ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందజేసింది. గీతంలో వినియోగించిన (వృధా) కాగితం, పుస్తకాలను ఒకచోట చేర్చి, వాటిని పునర్వినియోగం కోసం ప్రతియేటా ఐటీసీకి పంపడం ఆనవాయితీగా వస్తోంది. అలా 2023-24 సంవత్సరంలో 9,380 కిలోల కాగితపు వ్యర్థాలను పునర్వినియోగం కోసం పంపగా, తద్వారా ఏడు క్యూబిక్ మీటర్ల పల్లపు స్థలం, 65,525 కిలోల నీరు, 37,443 యూనిట్ల విద్యుత్, 11 మీటర్ల కర్బన ఉద్గారాలు (కార్బన్ డై ఆక్సైడ్) తగ్గడానికి గీతం సహకరించినట్టు ఆ ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు.ఈ అవార్డును ఐటీసీ లిమిటెడ్ పేపర్ బోర్డ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్ అండ్ సీఎస్ఆర్) సిబ్ శంకర్ బందోపాధ్యాయ, ఎంఏఆర్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.మురళి స్వయంగా సంతకం చేసి ఇవ్వడం విశేషం.స్థిరమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించడంలో గీతం చురుకైన పాత్రను గుర్తించడం తమకు గర్వకారణమని బందోపాధ్యాయ వ్యాఖ్యానించారు. రీసైక్లింగ్ (పునర్ వినియోగం), పర్యావరణ పరిరక్షణ పట్ల గీతం అంకితభావం ఐటీసీ వావ్ యొక్క స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తుందని, ఇది మనదేశాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంగా మార్చడానికి దశాబ్ద కాలం తాము చేస్తున్న కృషికి ఊతమిస్తోందన్నారు.

ఐటీసీ వావ్ అనేది వ్యర్థాలు ఉత్పత్తయ్యే చోటే వాటిని తడి, పొడి చెత్తగా విభజించి, పునర్ వినియోగం, పునరుద్ధరణ ద్వారా ఘన వ్యర్థాలను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక మార్గదర్శక కార్యక్రమంగా బందోపాధ్యాయ వివరించారు. దాదాపు దశాబ్ద కాలంగా ఐటీసీ గ్రూపు బెంగళూరు, మైసూరు, హైదరాబాదు, కోయంబత్తూర్, చెన్నై, ఢిల్లీతో సహా ప్రధాన నగరాలలో సుస్థిరత కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని, దాదాపుగా యేడాదికి 64 వేల మెట్రిక్ టన్నుల పొడి వ్యర్థాలను సేకరిస్తోందని తెలిపారు.తద్వారా 17,750 మందికి పైగా వ్యర్థ పదార్థాల నిర్వహణదారులకు స్థిరమైన జీవనోపాధిని కల్పిస్తోందని, 57 లక్షల మంది బడికెళ్లే బాలల్లో దీనిపై చైతన్యం తీసుకొచ్చామని, దాదాపుగా 2.2 కోట్ల మంది పౌరులు వ్యర్థాల నిర్వహణలో స్థిరమైన పద్ధతులను అవలంబిస్తున్నట్టు బందోపాధ్యాయ పేర్కొన్నారు. తమ ఈ చొరవ పచ్చదనం, పరిశుభ్రమైన భవిష్యత్తు కోసమేనని ఆయన స్పష్టీకరించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

5 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

5 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago