politics

ప్రభుత్వం పై నిందలు మోపడం సరికాదు…

ప్రభుత్వం పై నిందలు మోపడం  సరికాదు..

– వాశిలి చంద్రశేఖర్ ప్రసాద్

శేరిలింగంపల్లి :

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలందరూ ప్రభుత్వం పై నిందలు మోపడం మాని, తప్పనిసరిగా ఎవరికివారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రముఖ సామాజిక వేత్త, టీఆరెస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ ప్రసాద్ ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యంగా తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరికొద్ది రోజులపాటు ఇదే పరిస్థితి ఉండవచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు. ప్రజలు సహకరించాలని, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికి మరణాలు మాత్రం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటికే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కూడా విధించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ చాలా త్వరగా వ్యాపిస్తున్నందున ప్రతిఒక్కరూ బాధ్యతతో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని, సామాజిక దూరం పాటించాలని అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కోరారు. ఇళ్లలోనే ఉండి స్వీయ నియంత్రణ పాటించాలని, మనమంతా తగిన జాగ్రత్తలు పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Venu

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

17 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

17 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

17 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago