చురుకుగా పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ‘ఒక భూమి కోసం యోగా, ఒక ఆరోగ్యం’ ఇతివృత్తంలో స్పోర్ట్స్ డైరెక్టరేట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. యోగా సాధన ద్వారా సమగ్ర శ్రేయస్సు, పర్యావరణ స్పృహను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ వేడుక సాగింది.
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగాభ్యాసాల ప్రాముఖ్యతను నిపుణుడైన యోగా బోధకుడు పరిచయం చేయడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తరువాత భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన సాధారణ యోగా ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాన్ని కొనసాగించారు. యోగాసనాలు, కపాలభాతి, ప్రాణాయామం, ధ్యానం వంటివి సాధన చేశారు.క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల పని ప్రదేశంలో ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని, సమగ్ర శ్రేయస్సును ఎలా పెంచుతుందో బోధకుడు వివరించారు. శాంతి ప్రార్థనతో ఈ యోగ సాధన కార్యక్రమం ముగిసింది.గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు; రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, పలువురు విభాగాధిపతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పురాతన క్రమశిక్షణను స్వీకరించడంలోని ఔచిత్యాన్ని వారు ఆచరణ రూపంలో చాటిచెప్పారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…