Districts

గీతమ్ ప్రొఫెసర్కు అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రాజెక్ట్

మనవార్తలు ,పటాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లోని గణితశాస్త్ర విభాగం అధ్యాపకుడు ప్రొఫెసర్ బి.ఎం.నాయుడు అమెరికాలోని కుషి బేబీ ఇంక్ నుంచి కన్సల్టెన్సీ ప్రాజెక్టును పొందారు . ఏడాదికి రూ .16.5 లక్షలు ( ప్రయాణ ఖర్చులు అదనం ) వెచ్చించే ఈ ఒప్పందంపై త్వరలో గీతం- కుషి బేబీ ఇంక్ సంతకం చేయనున్నట్టు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . రాజస్థాన్ , కర్ణాటక రాష్ట్రాలలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి మాతా – శిశు ఆరోగ్య సేవలు ప్రతి ఒక్క పౌరుడికీ అందేలా కుషీ బేబీ కృషిచేస్తున్నట్టు తెలియజేశారు . డాక్టర్ నాయుడు తన కన్సల్టెన్సీ సేవలను అనేక రకాల కార్యకలాపాలపై పర్యవేక్షణ , మూల్యాంకనాధికారిగా నిర్వహిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

మార్పు సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడం , పరిశోధన కార్యకలాపాలు అమలు చేయడంలో సలహాలు , విదేశీ పరిశోధనా భాగస్వామ్యాలను ఏర్పరచడంలో వ్యూహాత్మక పాత్ర పోషిస్తారని తెలిపారు . అలాగే ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అభివృద్ధి చేయడం , ప్రాజెక్టు సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడంలో పరిమాణాత్మక డేటా పర్యవేక్షణ , విశ్లేషణలను నిర్వహిస్తారని , వాస్తవికంగా కీలక పనితీరు సూచికలను ( కేపీఐ ) కూడా అభివృద్ధి చేస్తారని వివరించారు .

గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రాజెక్టు పొందడం పట్ల డాక్టర్ నాయుడుని అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago