Districts

గీతమ్ ప్రొఫెసర్కు అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రాజెక్ట్

మనవార్తలు ,పటాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లోని గణితశాస్త్ర విభాగం అధ్యాపకుడు ప్రొఫెసర్ బి.ఎం.నాయుడు అమెరికాలోని కుషి బేబీ ఇంక్ నుంచి కన్సల్టెన్సీ ప్రాజెక్టును పొందారు . ఏడాదికి రూ .16.5 లక్షలు ( ప్రయాణ ఖర్చులు అదనం ) వెచ్చించే ఈ ఒప్పందంపై త్వరలో గీతం- కుషి బేబీ ఇంక్ సంతకం చేయనున్నట్టు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . రాజస్థాన్ , కర్ణాటక రాష్ట్రాలలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి మాతా – శిశు ఆరోగ్య సేవలు ప్రతి ఒక్క పౌరుడికీ అందేలా కుషీ బేబీ కృషిచేస్తున్నట్టు తెలియజేశారు . డాక్టర్ నాయుడు తన కన్సల్టెన్సీ సేవలను అనేక రకాల కార్యకలాపాలపై పర్యవేక్షణ , మూల్యాంకనాధికారిగా నిర్వహిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

మార్పు సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడం , పరిశోధన కార్యకలాపాలు అమలు చేయడంలో సలహాలు , విదేశీ పరిశోధనా భాగస్వామ్యాలను ఏర్పరచడంలో వ్యూహాత్మక పాత్ర పోషిస్తారని తెలిపారు . అలాగే ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అభివృద్ధి చేయడం , ప్రాజెక్టు సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడంలో పరిమాణాత్మక డేటా పర్యవేక్షణ , విశ్లేషణలను నిర్వహిస్తారని , వాస్తవికంగా కీలక పనితీరు సూచికలను ( కేపీఐ ) కూడా అభివృద్ధి చేస్తారని వివరించారు .

గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రాజెక్టు పొందడం పట్ల డాక్టర్ నాయుడుని అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago