Telangana

మధ్యవర్తిత్వంపై అంతర్జాతీయ సమావేశం…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ లా ఆధ్వర్యంలో ఈనెల 9-10 తేదీలలో ‘ నూతన సహస్రాబ్దిలో మధ్యవర్తిత్వం వివాదాలను పరిష్కరించే విధానం : ముందుకెళ్లే మార్గం ‘ అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును వర్చువల్ విధానంలో నిర్వహించనున్నారు . ఈ విషయాన్ని సదస్సు సమన్వయకర్త ఎన్.అప్పలరాజు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు . మధ్యవర్తిత్వం సమర్థంగా నిర్వహించడానికి తక్షణ చర్యలు అవసరమని , ప్రస్తుత సదస్సు ఆ దిశలో ఓ ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు . మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాల్గొన్న , ఆసక్తి ఉన్న వారి అభిప్రాయాలు , ఆలోచనలు , సూచనలను తెలుసుకోవడం లక్ష్యంగా ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు . భారత సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఈ సదస్సులో కీలకోపన్యాసం చేస్తారన్నారు . ప్రముఖ వక్తలు- ప్రొఫెసర్ ప్రాన్సిస్ లా , డాక్టర్ వాసిక్ అబాస్ దార్ , బ్రిటన్కు చెందిన ప్రొఫెసర్ బ్రయాన్ క్లార్క్ , జర్మనీకి చెందిన సమీర్ షా , ఆంధ్రప్రదేశ్ హెక్టార్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.యతిరాజులు , ప్రపంచ మేధో సంపత్తి సంస్థ మాజీ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎస్.రామారావు , సింగపూర్ లోని మధ్యవర్తి అజీజ్ తయాబాలి సామివాల్లా , అమెరికాకు చెందిన ప్రగ్యా శర్మ తదితరులు పాల్గొంటారని తెలియజేశారు . నీతి : మధ్యవర్తిత్వం , మధ్యవర్తిత్వం : మధ్యవర్తి పాత్ర , ట్రాన్స్ – నేషనల్ మధ్యవర్తిత్వ సమస్యలు వంటి పలు అంశాలపై విద్యార్థులు గోడపత్రికలు / పరిశోధనా పత్రాలు సమర్పించవచ్చన్నారు . విద్యావేత్తలు , న్యాయవాదులు , న్యాయాధికారులు , పరిశ్రమలోని వ్యక్తులు , విద్యార్థులు , పరిశోధక స్కాలర్లు ఈ రెండు రోజుల వర్చువల్ సదస్సులో పాల్గొనవచ్చని సమన్వయకర్త తెలియజేశారు . పేర్ల నమోదు , ఇతర వివరాల కోసం డాక్టర్ సీహెచ్ . లక్ష్మణరావు ( 99087 27688 ) లేదా ఎన్.ఏ.రాజు ( 79895 04959 ) ని సంప్రదించ్చన్నారు

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

2 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago