Telangana

మధ్యవర్తిత్వంపై అంతర్జాతీయ సమావేశం…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ లా ఆధ్వర్యంలో ఈనెల 9-10 తేదీలలో ‘ నూతన సహస్రాబ్దిలో మధ్యవర్తిత్వం వివాదాలను పరిష్కరించే విధానం : ముందుకెళ్లే మార్గం ‘ అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును వర్చువల్ విధానంలో నిర్వహించనున్నారు . ఈ విషయాన్ని సదస్సు సమన్వయకర్త ఎన్.అప్పలరాజు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు . మధ్యవర్తిత్వం సమర్థంగా నిర్వహించడానికి తక్షణ చర్యలు అవసరమని , ప్రస్తుత సదస్సు ఆ దిశలో ఓ ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు . మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాల్గొన్న , ఆసక్తి ఉన్న వారి అభిప్రాయాలు , ఆలోచనలు , సూచనలను తెలుసుకోవడం లక్ష్యంగా ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు . భారత సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఈ సదస్సులో కీలకోపన్యాసం చేస్తారన్నారు . ప్రముఖ వక్తలు- ప్రొఫెసర్ ప్రాన్సిస్ లా , డాక్టర్ వాసిక్ అబాస్ దార్ , బ్రిటన్కు చెందిన ప్రొఫెసర్ బ్రయాన్ క్లార్క్ , జర్మనీకి చెందిన సమీర్ షా , ఆంధ్రప్రదేశ్ హెక్టార్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.యతిరాజులు , ప్రపంచ మేధో సంపత్తి సంస్థ మాజీ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎస్.రామారావు , సింగపూర్ లోని మధ్యవర్తి అజీజ్ తయాబాలి సామివాల్లా , అమెరికాకు చెందిన ప్రగ్యా శర్మ తదితరులు పాల్గొంటారని తెలియజేశారు . నీతి : మధ్యవర్తిత్వం , మధ్యవర్తిత్వం : మధ్యవర్తి పాత్ర , ట్రాన్స్ – నేషనల్ మధ్యవర్తిత్వ సమస్యలు వంటి పలు అంశాలపై విద్యార్థులు గోడపత్రికలు / పరిశోధనా పత్రాలు సమర్పించవచ్చన్నారు . విద్యావేత్తలు , న్యాయవాదులు , న్యాయాధికారులు , పరిశ్రమలోని వ్యక్తులు , విద్యార్థులు , పరిశోధక స్కాలర్లు ఈ రెండు రోజుల వర్చువల్ సదస్సులో పాల్గొనవచ్చని సమన్వయకర్త తెలియజేశారు . పేర్ల నమోదు , ఇతర వివరాల కోసం డాక్టర్ సీహెచ్ . లక్ష్మణరావు ( 99087 27688 ) లేదా ఎన్.ఏ.రాజు ( 79895 04959 ) ని సంప్రదించ్చన్నారు

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

19 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

20 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago