పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ లా ఆధ్వర్యంలో ఈనెల 9-10 తేదీలలో ‘ నూతన సహస్రాబ్దిలో మధ్యవర్తిత్వం వివాదాలను పరిష్కరించే విధానం : ముందుకెళ్లే మార్గం ‘ అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును వర్చువల్ విధానంలో నిర్వహించనున్నారు . ఈ విషయాన్ని సదస్సు సమన్వయకర్త ఎన్.అప్పలరాజు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు . మధ్యవర్తిత్వం సమర్థంగా నిర్వహించడానికి తక్షణ చర్యలు అవసరమని , ప్రస్తుత సదస్సు ఆ దిశలో ఓ ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు . మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాల్గొన్న , ఆసక్తి ఉన్న వారి అభిప్రాయాలు , ఆలోచనలు , సూచనలను తెలుసుకోవడం లక్ష్యంగా ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు . భారత సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఈ సదస్సులో కీలకోపన్యాసం చేస్తారన్నారు . ప్రముఖ వక్తలు- ప్రొఫెసర్ ప్రాన్సిస్ లా , డాక్టర్ వాసిక్ అబాస్ దార్ , బ్రిటన్కు చెందిన ప్రొఫెసర్ బ్రయాన్ క్లార్క్ , జర్మనీకి చెందిన సమీర్ షా , ఆంధ్రప్రదేశ్ హెక్టార్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.యతిరాజులు , ప్రపంచ మేధో సంపత్తి సంస్థ మాజీ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎస్.రామారావు , సింగపూర్ లోని మధ్యవర్తి అజీజ్ తయాబాలి సామివాల్లా , అమెరికాకు చెందిన ప్రగ్యా శర్మ తదితరులు పాల్గొంటారని తెలియజేశారు . నీతి : మధ్యవర్తిత్వం , మధ్యవర్తిత్వం : మధ్యవర్తి పాత్ర , ట్రాన్స్ – నేషనల్ మధ్యవర్తిత్వ సమస్యలు వంటి పలు అంశాలపై విద్యార్థులు గోడపత్రికలు / పరిశోధనా పత్రాలు సమర్పించవచ్చన్నారు . విద్యావేత్తలు , న్యాయవాదులు , న్యాయాధికారులు , పరిశ్రమలోని వ్యక్తులు , విద్యార్థులు , పరిశోధక స్కాలర్లు ఈ రెండు రోజుల వర్చువల్ సదస్సులో పాల్గొనవచ్చని సమన్వయకర్త తెలియజేశారు . పేర్ల నమోదు , ఇతర వివరాల కోసం డాక్టర్ సీహెచ్ . లక్ష్మణరావు ( 99087 27688 ) లేదా ఎన్.ఏ.రాజు ( 79895 04959 ) ని సంప్రదించ్చన్నారు
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…