politics

త్వరలో తెలంగాణలో ఇన్లాండ్ పోర్ట్ !

పటాన్ చెరు:

దుబాయ్ కు చెందిన బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీ డీపీ వరల్డు విశ్వవ్యాప్తంగా 60 పెద్ద ఓడరేవులు ఉన్నాయని , హైదరాబాద్ చుట్టుపక్కల సరకు రవాణా కోసం టెర్నినల్ను ( ఇన్లాండ్ పోర్ట్ ) నిర్మించాలనే యోచనలో ఉందని , త్వరలో అది సాకారం కావొచ్చని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య అధ్యక్షుడు కె.భాస్కరరెడ్డి చెప్పారు . గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ( జీహెచ్బీఎస్ ) లోని ఆపరేషన్స్ అండ్ సప్లయ్ చెనై ఆధ్వర్యంలో ‘ లాజిస్టిక్స్ రంగం , అందులో పెరుగుతున్న కెరీర్ అవకాశాలు ‘ అనే అంశంపై నిర్వహిస్తున్న ఒకరోజు అంతర్జాతీయ చర్చాగోష్ఠిని గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు .

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ , లాజిస్టిక్స్ రంగంలో అపూర్వమైన వృద్ధి నమోదవుతోందని , మనదేశంలో అధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే రంగాలలో ఒకటిగా ఇది నిలిచిందని చెప్పారు . ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన గతిశక్తి పథకం ఈ రంగానికి పెద్ద వరమన్నారు . విద్యార్థులు సొంతంగా పరిశోధనలు చేపట్టడంతో పాటు ఇంటర్నేస్లు చేస్తే ఈ రంగంపై మంచి అవగాహన ఏర్పడుతుందని ఆయన సూచించారు .

ఎంతో ఆశావహంగా ఉన్న ఈ రంగానికి కృత్రి మేథ , రోబోటిక్స్ వంటి అత్యాధునిక పరిజ్ఞానం తోడెతే మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని భాస్కరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు . 1981 నుంచి లాజిస్టిక్స్ రంగం ఎదుగుదల , సాధిస్తున్న ప్రగతిని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ గుర్తుచేశారు . మనదేశ జాతీయ స్థూల ఉత్పత్తిలో లాజిస్టిక్స్ రంగానికి 12 శాతం వాటా ఉందని , 18 శాతం వృద్ధిని ఆ రంగం నమోదు చేస్తున్నట్టు జీహెచ్బీఎస్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ చెప్పారు .

లాజిస్టిక్స్ రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాల గురించి చెన్నయ్ లోని లాజిస్టిక్స్ నెఫుణ్య మండలి ( ఎన్ఎస్సీ ) సీఈవో కెప్టెన్ రామానుజన్ , స్నాతకోత్సవ స్థాయిలో లాజిస్టిక్స్న ఒక పాఠ్యాంశంగా ప్రోత్సహించడంలో ఎల్ఎస్సీ పాత్ర గురించి ఆ సంస్థ అధిపతి ప్రొఫెసర్ ఎస్.గణేషన్ వివరించగా , డెల్లాయిట్కు చెందిన టెక్నాలజీ కన్సల్టింగ్ డెరైక్టర్ సందీప్ చటర్జీ , జీఎంఆర్ ఎయిర్ కార్గో సీఈవో సౌరబ్ కుమార్ , ఐఎన్ఎస్ దక్షిణాసియా డెరైక్టర్ విపిన్ శంకర్ , బెల్జియంలోని పోర్ట్ ప్రాజెక్ట్స్ మేనేజర్ కొయిన్ కొర్నెల్లీ , ఐఎస్బీ సీనియర్ డీన్ ప్రొఫెసర్ చందన్ చౌధురి , షార్జాలోని స్కెలైన్ యూనివర్సిటీ డీన్ వె.రామకృష్ణ తదితరులు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు . తొలుత ప్రొఫెసర్ దేబాషిశ్ ముఖర్జీ అతిథులను స్వాగతించగా , కార్యక్రమ నిర్వాహకుడు ఫకృద్దీన్ షేక్ వందన సమర్పణ చేశారు .

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago