Telangana

గ్రామాల అభివృద్ధికి పరిశ్రమలు ముందుకు రావాలి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_రుద్రారం గ్రామంలో 11 కోట్ల రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల,

_అంగన్వాడి భవనం, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన 

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతోపాటు, ఆధునిక వసతులతో ప్రభుత్వ పాఠశాల భవనాలను నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో ఎం వై కే లాటిక్రేట్ సంస్థ సౌజన్యంతో 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం, ప్రాథమిక పాఠశాల భవనం, అంగన్వాడి భవనం, తోషిబా పరిశ్రమ సహకారంతో కోటి రూపాయల నిధులతో చేపట్టనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనం, ఆర్వో ప్లాంట్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నిపుణులైన సిబ్బందితోపాటు అన్ని రకాలైన మౌలిక వసతులు ఉంటాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యారంగానికి పెద్దపీట వేయడంతో పాటు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా వేల కోట్ల రూపాయలు కేటాయించి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. వీటితోపాటు దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రవ్యాప్తంగా 1000కి పైగా గురుకులాలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించారని గుర్తు చేశారు. మినీ ఇండియా గా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక శాతం నిరుపేద విద్యార్థుల విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు వివిధ పరిశ్రమల సౌజన్యంతో ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక వసతులతో భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీ రాజు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సంస్థ ముఖ్య ప్రతినిధులు శ్రీకర్, రోహిత్, సూర్య ప్రకాష్, ఉప సర్పంచ్ యాదయ్య, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago