Telangana

60 లక్షల రూపాయలతో ఇంద్రేశం రహదారి మరమ్మతులు

అతి త్వరలో పూర్తిస్థాయిలో రహదారి విస్తరణ.. నిర్మాణం..

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు నుండి ఇంద్రేశం మీదుగా పెద్ద కంజర్ల వరకు గల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు అతి త్వరలో హెచ్ఎండిఏ ద్వారా రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్ చెరు పరిధిలోని ఓఆర్ సర్వీస్ రోడ్డు నుండి ఇంద్రేశం మీదుగా పెందకంజర్ల వరకు 60 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న బీటీ ప్యాచ్ వర్క్ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరు పట్టణానికి ఇంద్రేశంతో పాటు. రామేశ్వరం బండ, పెద్దకంజర్ల, చిన్న కంజర్ల, ఐనోలు, బచ్చు గూడెం, పోచారం తో పాటు నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ఈ రహదారినే వినియోగిస్తారని తెలిపారు. గతంలో ఇంద్రేశం నుండి పెద్దకంచెర్ల వరకు 22 కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనుల కోసం నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. అనివార్య కారణాల వలన విధుల కేటాయింపు రద్దు కావడం మూలంగా.. తిరిగి రహదారి వరమ్మత్తులు చేపట్టారని. ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు. అతి త్వరలో రహదారి విస్తరణ పనులు సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో బీటీ ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఏ ఈ చంద్రశేఖర్, ట్రాఫిక్ సిఐ లాలు నాయక్, మాజీ ప్రజాప్రతినిధులు అంతిరెడ్డి, బండి శంకర్, దుర్గా రెడ్డి, రామచందర్, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

15 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

16 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago