అతి త్వరలో పూర్తిస్థాయిలో రహదారి విస్తరణ.. నిర్మాణం..
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు నుండి ఇంద్రేశం మీదుగా పెద్ద కంజర్ల వరకు గల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు అతి త్వరలో హెచ్ఎండిఏ ద్వారా రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్ చెరు పరిధిలోని ఓఆర్ సర్వీస్ రోడ్డు నుండి ఇంద్రేశం మీదుగా పెందకంజర్ల వరకు 60 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న బీటీ ప్యాచ్ వర్క్ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరు పట్టణానికి ఇంద్రేశంతో పాటు. రామేశ్వరం బండ, పెద్దకంజర్ల, చిన్న కంజర్ల, ఐనోలు, బచ్చు గూడెం, పోచారం తో పాటు నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ఈ రహదారినే వినియోగిస్తారని తెలిపారు. గతంలో ఇంద్రేశం నుండి పెద్దకంచెర్ల వరకు 22 కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనుల కోసం నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. అనివార్య కారణాల వలన విధుల కేటాయింపు రద్దు కావడం మూలంగా.. తిరిగి రహదారి వరమ్మత్తులు చేపట్టారని. ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు. అతి త్వరలో రహదారి విస్తరణ పనులు సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో బీటీ ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఏ ఈ చంద్రశేఖర్, ట్రాఫిక్ సిఐ లాలు నాయక్, మాజీ ప్రజాప్రతినిధులు అంతిరెడ్డి, బండి శంకర్, దుర్గా రెడ్డి, రామచందర్, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…