Telangana

జాతీయ భావాన్ని పెంపొందించేలా స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటున్నాం – చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధుముదిరాజ్

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

జాతీయ భావాన్ని ఉప్పొంగేలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు మండ‌ల చిట్కుల్ గ్రామ పరిధిలో 75 వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుకుల‌ను పుర‌స్క‌రించుకుని 50 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని తెరాస రాష్ట్ర నాయకులు,చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆర్చరీ, స్కేటింగ్ క్రీడాకారిణి బంగారు పతకం విజేత శాన్వి చేతుల మీదుగా ఆవిష్కరించారు. స్వాతంత్రం సాధించి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో జరుపుకుంటున్న వజ్రోత్సవ వేడుకల్లో పాలుపంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. స్వాతంత్ర సమరయోధులు స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.

మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎంతో అభివృద్ధి చేశారని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఇవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు.చిట్కుల్ గ్రామ పరిధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా గ్రామ కార్యవర్గం గ్రామస్తులు ఇతర అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్య క్రమంలో ఈవో కవిత ,ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి,ఎంపీటీసీలు మంజుల,మాధవి,వార్డు సభ్యులు దుర్గయ్య,లక్ష్మి, వెంకటేష్,గౌరీ,భుజంగం, మురళి,వెంకటేష్,రాజకుమార్, ఆంజనేయులు, రైతు సంఘం అధ్యక్షుడు వి నారాయణ రెడ్డి, చాకలి వెంకటేశ్,గోపాల్,అనిల్,వెంకటేశ్, గ్రామ పెద్దలు,ప్రజలు, యువజన సంఘాలు,విద్యార్థులు,ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

6 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago