Telangana

రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో పెరిగిన హుండీ ఆదాయం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని ​రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో ఈ ఏడాది హుండీ ఆదాయం పెరిగింది. వినాయ‌క చ‌వితి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా 78 రోజుల హుండీ ఆదాయం 25 ల‌క్ష‌ల 61 వేల 569 రూపాయ‌ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు . ​హుండీ ఆదాయంలో భాగంగా స్వామివారి హుండీ ద్వారా 24 ల‌క్ష‌ల 46 వేల 712 రూపాయ‌లు, అన్న‌దానం హుండీలో ల‌క్ష 14 వేల‌857 రూపాయ‌లు భ‌క్తులు స‌మ‌ర్పించుకున్న‌ట్లు ఆల‌య ఈవో లావ‌ణ్య తెలిపారు .ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతయ్యగా స్వయంభుగా వెలసిన స్వామి భక్తులకు కొంగుబంగారమై కోరిన కోరికలను నెరవేరుస్తూ నిరంతరం పూజలు అందుకుంటున్నార‌ని ఈవో లావ‌ణ్య తెలిపారు. భక్తులకు నమ్మకంతో  కుటుంబ సభ్యులతో విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి భక్తునికి సిద్ధి గణపతి స్వామి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె తెలిపారు
​ఈ కార్యక్రమంలో ఛైర్మ‌న్ హ‌రిప్ర‌సాద్ రెడ్డి , దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ రంగారావు, ఆల‌య జూనియ‌ర్ అసిస్టెంట్ ఈశ్వ‌ర్ , ధర్మకర్తల మండలి సభ్యులు నరసింహ గౌడ్, నాగరాజు గౌడ్, నరసింహులు, కృష్ణవేణి, నరసింహారెడ్డితో పాటు సేవా సమితి సభ్యులు, అర్చ‌కులు,రుద్రారం గ్రామ పెద్ద‌లు ,భ‌క్తులు పాల్గొన్నారు .

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

9 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago