పనుల్లో వేగం పెంచాలి….
– కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
పటాన్ చెరు:
డివిజన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.
సోమవారం డివిజన్ పరిధిలోని కటిక బస్తి లో మంజూరైన సిసి రోడ్లు ,నూతన డ్రైనేజీ లైను పనులు మందకొడిగా సాగుతున్న విషయాన్ని గమనించిన కార్పొరేటర్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి జరుగుతున్న పనులను పరిశీలించి పనులలో వేగం పెంచేలా చూడాలని అధికారులకు తెలిపారు.
అదేవిధంగా శాంతినగర్ గౌతం నగర్ కాలనీ లో పర్యటించారు. కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న కార్పొరేటర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో మాట్లాడి నూతన డ్రైనేజీ వ్యవస్థ నిర్మించుటకు ఆదేశాలు ఇవ్వాలని, నూతన డ్రైనేజీ ఏర్పడితే కాలనీలో సమస్య ఉండదని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…