పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హెదరాబాద్ లోని మార్కెటింగ్ క్లబ్ మంగళవారం వార్షిక న్యూస్లెటర్ ‘ప్రమోషన్’ (అన్వేషించు, నేర్చుకో, ఎదుగు)ను ప్రారంభించింది. బీ-స్కూల్ అధిపతి ప్రొఫెసర్ వినయ్ కుమార్ అప్పరాజు ఈ న్యూస్లెటర్ను ఆవిష్కరించారు. ఆయనతో పాటు ప్రొఫెసర్ కరుణాకర్.బి, ప్రొఫెసర్ దేవీప్రసాద్, ప్రొఫెసర్ పినాకపాణి పేరి, డాక్టర్ నేనురాజు సుధ తదితరులు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన ప్రమోషన్ కమిటీని ప్రకటించారు.ఈ వార్షిక న్యూస్లెటర్ను వెలువరించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని ప్రొఫెసర్ వినయ్ కుమార్ అభినందించారు. కొత్త బృందం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.
మార్కెటింగ్ క్లబ్ హెడ్ (2021-23 బ్యాచ్) శ్రీవాణి తమ రెండేళ్ల ప్రయాణాన్ని వివరించారు. ప్రమోషన్ నూతన అధిపతి శివాంజలి శివకుమార్ మాట్లాడుతూ, తమ ప్రాథమిక లక్ష్యం సహకారం, ఆవిష్కరణ, శ్రేష్ఠత సంస్కృ తిన పెంపొందించడమని చెప్పారు. అలాగే తమ భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన రెండు వీడియోలు (సీనియర్ల సంతోషకరమైన ప్రయాణం, న్యూస్లెటర్ ఆవిష్కరణలో జూనియర్ల కృషి) అందరి మన్ననలను చూరగొన్నాయి.ఈ కార్యక్రమంలో బీ-స్కూల్కు చెందిన పలువురు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…