Telangana

ఘనపూర్ గ్రామంలో నాలుగు కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభోత్సవం

_కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలు

_వచ్చే నెలలో 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు, ఉచిత పరీక్ష సామాగ్రి పంపిణీ

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటాన్చెరు నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు ఆధునిక వసతులతో ప్రభుత్వ పాఠశాలల భవనాలను నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరువు మండలం ఘనపూర్ గ్రామంలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో నాలుగు కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని గురువారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు మన ఊరు మనబడి ద్వారా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు పక్కా భవనాలను నిర్మించామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలలోనూ ప్రభుత్వం మరియు సి ఎస్ ఆర్ నిధులతో పక్కా భవనాలు నిర్మించామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల మూలంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం సిఫార్సులు చేయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.ఘనాపూర్ గ్రామంలో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనంలో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులకు సూచించారు.నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 7000 మంది విద్యార్థులకు వచ్చే నెల మొదటి వారంలో మోటివేషనల్ క్లాసులు నిర్వహించబోతున్నామని తెలిపారు. దీంతోపాటు ప్రతి విద్యార్థికి పరీక్షా కిట్లు అందించబోతున్నట్లు తెలిపారు.పాఠశాలల అభివృద్ధికి గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సిఎస్ఆర్ ద్వారా నిధులు కేటాయించడం పట్ల సంస్థ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సిఎస్ఆర్ విభాగం అధిపతి రఘురామన్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కావ్య కాశిరెడ్డి, ఎంపీటీసీ నీనా చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ విట్టలయ్య, ఎంఈఓ రాథోడ్, రాఘవేంద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర్ నాయక్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

8 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

8 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

8 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

8 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

8 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago