Telangana

5 కోట్ల 8 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పల్లెను ప్రగతి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి, ఇస్నాపూర్ చిట్కుల్, రుద్రారం, లకడారం, ఘనాపూర్, పాటి, కర్ధనూర్, నందిగామ గ్రామాల్లో 5 కోట్ల 8 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సిసి రోడ్లను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం నూతన రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పథకం గ్రామాల రూప రేఖలను మార్చిందని తెలిపారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, అంతర్గత డ్రైనేజీలు, వీధి దీపాలు, నర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ట్రాక్టర్లు అందించడం జరిగిందని తెలిపారు. పరిశుభ్రత పచ్చదనానికి పెద్ద పీట వేస్తూ పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపడుతున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తూ తాగునీటి కొరతను అధిగమించడం జరిగిందని తెలిపారు. 24 గంటల పాటు నాణ్యమైన కరెంటును అందిస్తూ ప్రగతి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, ఎంపీడీవో బన్సీలాల్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఉపేందర్, బాలమణి శ్రీశైలం, సుధీర్ రెడ్డి, సువర్ణ మాణిక్ రెడ్డి, కావ్య కాశిరెడ్డి, లక్ష్మన్, ఉమామతి గోపాల్, భాగ్యలక్ష్మి, నీలం మధు, ఎంపీటీసీలు అంజిరెడ్డి, శ్రీశైలం, మంజుల శ్రీశైలం యాదవ్, మన్నె రాజు, హరి ప్రసాద్ రెడ్డి, నాగజ్యోతి, నీనా చంద్రశేఖర్ రెడ్డి, శైలజ, మాధవి నరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago