పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సెన్స్, గణిత శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ కృష్ణ, కుమ్మరి, భారత జాతీయ సెన్స్ అకాడమీ (ఐఎన్ఎస్) విజిటింగ్ సెంటిస్ట్ ప్రోగ్రాము ఎంపికయ్యారు. ఈ విషయాన్నిఆ విభాగాధిపతి డాక్టర్ మోతహర్ రెజా శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఐఎన్ఎస్పీ మార్గదర్శకాల ప్రకారం, ఫెలోషిప్ అనేది అధునాతన పరిశోధనలు, లేదా భారతీయ పరిశోధనా సంస్థలు/ప్రయోగశాలల్లో ప్రత్యేక శిక్షణ పొందడం కోసం ఉద్దేశించినదన్నారు. ఈ ఆవార్డు పొందిన వ్యక్తి మనదేశంలోని ఏదేని ప్రయోగశాల లేదా పరిశోధనా సంస్థలో కనీసం ఒక నెల నుంచి గరిష్టంగా ఆరు నెలల వరకు గడపవలసి ఉంటుందని తెలిపారు. అవార్డు గ్రహీతలకు ప్రయాణ ఖర్చులతో పాటు నెలకు 30 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తారన్నారు. ఐఎన్ఎస్పి విజిటింగ్ ఫెలోషిప్ పొందిన డాక్టర్ కృష్ణను సహ అధ్యాపకులు పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…