పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సెన్స్, గణిత శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ కృష్ణ, కుమ్మరి, భారత జాతీయ సెన్స్ అకాడమీ (ఐఎన్ఎస్) విజిటింగ్ సెంటిస్ట్ ప్రోగ్రాము ఎంపికయ్యారు. ఈ విషయాన్నిఆ విభాగాధిపతి డాక్టర్ మోతహర్ రెజా శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఐఎన్ఎస్పీ మార్గదర్శకాల ప్రకారం, ఫెలోషిప్ అనేది అధునాతన పరిశోధనలు, లేదా భారతీయ పరిశోధనా సంస్థలు/ప్రయోగశాలల్లో ప్రత్యేక శిక్షణ పొందడం కోసం ఉద్దేశించినదన్నారు. ఈ ఆవార్డు పొందిన వ్యక్తి మనదేశంలోని ఏదేని ప్రయోగశాల లేదా పరిశోధనా సంస్థలో కనీసం ఒక నెల నుంచి గరిష్టంగా ఆరు నెలల వరకు గడపవలసి ఉంటుందని తెలిపారు. అవార్డు గ్రహీతలకు ప్రయాణ ఖర్చులతో పాటు నెలకు 30 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తారన్నారు. ఐఎన్ఎస్పి విజిటింగ్ ఫెలోషిప్ పొందిన డాక్టర్ కృష్ణను సహ అధ్యాపకులు పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…