Telangana

దేవుడి పేరుతో.. పిఎం మోదీ రాజకీయం _మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ

* 400 సీట్లు సాధిస్తుందని ప్రజల్లో భ్రమలు

* గ్రౌండ్ లెవెల్ లో పడిపోయిన బిజెపి గ్రాఫ్

* ఎంపీ ఎన్నికలతో బిజెపి పూర్తిగా పతనం

* అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పార్లమెంటు ఎన్నికలలో బిజెపి 400 సీట్లు సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు భ్రమను కలిగిస్తున్నారని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ అన్నారు. గజ్వేల్ లోని శోభ గార్డెన్ లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశం నియోజికవర్గ ఇంచార్జ్ నర్సారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ నరేంద్ర మోడీ రాముడి పేరు చెప్పి రాజకీయం చేస్తున్నారని ఆమె విమర్శించారు. తెలంగాణలో అయితే బీజేపీ గ్రౌండ్ లెవెల్ లో పూర్తిగా పడిపోయిందని, ఈ ఎన్నికలలో పూర్తిగా పతనం అవడం ఖాయమని పేర్కొన్నారు. పేదలకు మోదీ ఏమీ చేయలేదని, అంబానీ, ఆదానీలకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. బిజెపి అభ్యర్థి ఏం అభివృద్ధి చేశాడో? చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల రూపాయల అవినీతి చేసిందని, ఇంకా అనే అక్రమాలు, దోపిడీలకు పాల్పడిందన్నారు. సోషల్ మీడియా వేదికగా అవినీతి, అక్రమాలు వెలుగు చూశాయని, తద్వారానే బిఆర్ఎస్ ప్రజలు గద్దె దించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకు వెళ్ళవలసిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమానికి అమలు చేయబోయే వాటిపైన కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు సూచించారు. సేవ చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చిన ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజును గెలిపించి పార్లమెంట్లోకి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి సురేఖ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మామ, అల్లుళ్లను ఇంటికి పంపించడం ఖాయం
మైనంపల్లి హనుమంత్ రావు

మామ, అల్లుళ్ళను నూటికి నూరు శాతం ఇంటికి పంపించడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి అన్నారు.కేసీఆర్ ను చింతమడకకు, హరీష్ రావును తోటపల్లికి పంపడమే లక్ష్యమన్నారు. తన ప్రధాన టార్గెట్ గజ్వేల్, సిద్దిపేటలో వాళ్లను ఓడించడమేనని పేర్కొన్నారు. మెదక్ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ ఉండాల్సిన అవసరం ఉందని, బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

నిర్మలా జగ్గారెడ్డి, నియోజికవర్గ ఇంచార్జ్ నర్సారెడ్డి

మెదక్ ఎంపీ సీటుపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి సోనియాగాంధీకి గిఫ్ట్ ఇవ్వాలని తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక నిర్బంధాలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. నిద్రపోకుండా నీలం మధును గెలిపించుకొని ఆయనను పార్లమెంటుకు పంపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజికవర్గ ఇంచార్జ్ ప్రమోద్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి నర్సారెడ్డి, నర్సాపూర్ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, ఒంటేరు నరేందర్ రెడ్డి, కేశిరెడ్డి రవీందర్ రెడ్డి, రాగుల రాజు, తాడూరి వెంకట్రామిరెడ్డి,హనునంత్ రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago