Telangana

చివరి దశలో మన ఊరు మన బడి పనులు

_పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరి మనబడి కార్యక్రమం ద్వారా పటాన్చెరు నియోజకవర్గంలో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.మన ఊరు మన బడి ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై మంగళవారం ఉదయం పటాన్చెరు మండల పరిషత్ సమావేశం మందిరంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో మొదటి విడతలో ఎంపికైన 55 పాఠశాలల్లో చేపట్టిన పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇప్పటికే 20 పాఠశాలలో పనులు పూర్తికాగా, మరో 35 పాఠశాలల్లో చివరి దశలో ఉన్నాయని తెలిపారు.

గుమ్మడిదల మండల పరిధిలో 8 పాఠశాలలు, జిన్నారం మండల పరిధిలో 15, అమీన్పూర్ మండల పరిధిలో 8, పటాన్చెరు మండల పరిధిలో 14, రామచంద్రపురం మండల పరిధిలో 10 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. వచ్చేనెల 12వ తేదీ లోపు పనులు పూర్తిచేసి, ఆయా పాఠశాలలకు అప్పగించాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నిధుల కొరత ఉంటే వెంటనే సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం 100% విజయం సాధించాలంటే సంపూర్ణంగా సహకరించాలని కోరారు.అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనులు మందకోడిగా సాగడంపై సంభందిత కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయకపోతే బ్లాక్ లిస్టులో పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులతో కూడిన మౌలిక వసతులు కల్పించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, ఎంపీపీ దేవానందం, కార్పొరేటర్లు, మెట్టు కుమార్ యాదవ్ పుష్ప నగేష్, మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, నరసింహా గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

8 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

10 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago