Telangana

డిసెంబర్‌లో ప్రముఖ గాయని కె ఎస్ చిత్ర ‘చిత్రామృతం

.-డిసెంబర్ 22న శిల్పకళా వేదికలో ‘చిత్రామృతం’ మ్యూజిక్‌ కన్సర్ట్‌ 

-నిర్వహించనున్న ఎన్ ఛాంట్ మీడియా, ఎమ్3 ఎంటర్టైన్‌మెంట్

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

ఎన్ ఛాంట్ మీడియా, ఎమ్3 ఎంటర్టైన్‌మెంట్‌ నిర్వహణలో 2024 డిసెంబర్ 22న శిల్పకళా వేదికలో ప్రముఖ గాయని కె ఎస్ చిత్ర ‘చిత్రామృతం’ మ్యూజిక్‌ కన్సర్ట్‌ నిర్వహించనున్నారు. ప్రముఖ గాయని కేఎస్ చిత్త్ర గారి 45 ఏళ్ల ప్రస్థానానికి స్మరణార్థంగా నిర్వహించనున్న ఈ చిత్రామృతం ప్రెస్ మీట్ హైదరాబాద్‌లోని జూబ్లీ రిడ్జ్ హోటల్‌లో జరిగింది. ఈ వేడుకలో కేఎస్ చిత్త్ర గారు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాల్గొని కన్సర్ట్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఇందులో ఇండియన్ ఐడల్ తెలుగు నుండి రజిని, దృతి, రజిని పూర్ణిమ, కీర్తన, శ్రీకీర్తి, వల్లభ, కుశాల్, సాయి మాధవ్ లు చిత్త్ర గారి ప్రసిద్ధ పాటలను ఆలపిస్తూ హృదయపూర్వకమైన ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనతో చిత్త్ర గారు ఎంతో భావోద్వేగానికి గురై, వారిని ఆశీర్వదించి, ఈ స్మరణీయ ప్రదర్శన కోసం వారికి ధన్యవాదాలు తెలిపారు.ఆర్పీ పట్నాయక్ , చిత్త్ర తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకొని, ఆమె వినయం మరియు వృత్తిపరమైన నిబద్ధత గురించి పేర్కొన్నారు, ఇది ఆమెతో పనిచేసిన ప్రతి ఒక్కరిపై చెరగని ముద్ర వేశాయన్నారు.ఎన్ ఛాంట్ మీడియా మరియు ఎమ్3 ఎంటర్టైన్‌మెం చిత్రామృతం కచేరీ 2024 డిసెంబర్ 22న శిల్పకళా వేదికలో జరగనుంది, టికెట్లు ఇప్పటికీ బుక్ మై షో లో అందుబాటులో ఉన్నాయి. ఈ కచేరీ చిత్త్ర గారి అమరగానాలు మరియు సహగాయనుల నివాళులతో నిండిన రాత్రిని ఆహ్వానిస్తోంది.ఈ వేడుకను నిర్వహించిన ఎన్ ఛాంట్ మీడియా మరియు ఎమ్3 ఎంటర్టైన్‌మెంట్ వారు చిత్త్ర గారికి ఈ అద్భుతమైన ఉత్సవం ద్వారా ఆమెను గౌరవించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే కచేరీపై తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago