ప్రారంభ దశలోనే వ్యాధి నిర్ధారణతో సురక్షిత చికిత్స సాధ్యం
ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య కొండేటి
డాక్టర్ సవిత్ర శాస్త్రి బి.వి
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :
మెదడు, వెన్నెముక సంబంధిత వ్యాధుల భారము రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక వైద్య సాంకేతికతతో చికిత్సలు మరింత సురక్షితంగా, సమర్థవంతంగా మారుతున్నాయని ప్రముఖ వైద్య నిపుణులు తెలిపారు. కిమ్స్ ఆసుపత్రి స్పైన్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య కొండేటి , సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ & మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జన్ డాక్టర్ సవిత్ర శాస్త్రి బి.వి. మీడియాతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఈ విషయాలను వెల్లడించారు.మెదడు, వెన్నెముక వ్యాధుల లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించడం అత్యంత కీలకమని వారు తెలిపారు. నిరంతర వెన్నునొప్పి, చేతులు లేదా కాళ్లలో బలహీనత, తిమ్మిరి, నడకలో అసమతుల్యత, తరచూ తలనొప్పి, మాటతీరు లేదా చూపులో మార్పులు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల్లో మందులతో చికిత్స , మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీలు, ఆధునిక మెదడు శస్త్రచికిత్సలు వంటి పలు ఎంపికలు ఉన్నాయని తెలిపారు. ప్రతి రోగి ఆరోగ్య పరిస్థితి, వ్యాధి తీవ్రత, ఇతర వైద్య అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స నిర్ణయిస్తామని వివరించారు.ఓపెన్ సర్జరీల స్థానంలో మినిమల్లీ ఇన్వేసివ్ శస్త్రచికిత్సలు వేగంగా విస్తరిస్తున్నాయని, వీటి ద్వారా కణజాల నష్టం, రక్తస్రావం తగ్గడంతో పాటు ఆస్పత్రిలో ఉండే రోజులు తగ్గి రోగులు త్వరగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అత్యాధునిక ఇమేజింగ్, నావిగేషన్ టెక్నాలజీల వినియోగంతో శస్త్రచికిత్సల ఖచ్చితత్వం, భద్రత మరింత పెరిగిందని చెప్పారు.మెదడు శస్త్రచికిత్సల్లో నావిగేషన్ గైడెడ్, ఎండోస్కోపిక్ పద్ధతుల వల్ల మెదడులోని అత్యంత సున్నితమైన భాగాలకు హాని కలగకుండా అధిక ఖచ్చితత్వంతో శస్త్రచికిత్సలు నిర్వహించే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. దీంతో రోగుల కోలుకునే సమయం తగ్గడమే కాకుండా చికిత్స ఫలితాలు కూడా మెరుగుపడుతున్నాయని వెల్లడించారు.
ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య కొండేటి మరియు డాక్టర్ సవిత్ర శాస్త్రి బి.వి మాట్లాడుతూ రోగుల అవగాహన, భద్రత, సరైన వైద్య నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులు సూచించారు. మెదడు లేదా వెన్నెముక సమస్యకు శస్త్రచికిత్స అవసరం ఉండదని, అనుభవజ్ఞులైన వైద్యుల సమగ్ర పరీక్ష అనంతరమే చికిత్సను నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు.ప్రజల్లో మెదడు, వెన్నెముక ఆరోగ్యంపై అవగాహన పెంచడం, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించేలా ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీ పురం 268 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…
ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…
మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు : గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…
పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…