Telangana

బోధన, పరిశోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోండి

గీతం ఆర్థిక శాస్త్ర అధ్యాపకులకు ఇన్ చార్జి వీసీ ప్రొఫెసర్ గౌతమరావు సూచన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతమలో ఆర్థిక శాస్త్రం బోధిస్తున్న అధ్యాపకులు తమ బోధన, పరిశోధన నైపుణ్యాలను మరింత మెరుగు పరచుకుని సమీప భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించాలని గీతం ఉప కులపతి (ఇన్ఛార్జ్) ప్రొఫెసర్ వై.గౌతమరావు సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ స్ ఆధ్వర్యంలో ‘బోధనా శాస్త్రం, పరిశోధనా నైపుణ్యాలను పెంచడం: ఎకనామెట్రిక్ విశ్లేషణలో ఆర్ యొక్క ఉపయోగం’ అనే అంశంపై ఈనెల 18-20వ తేదీ వరకు నిర్వహించనున్న అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్ డీపీ) బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఎకనామెట్రిక్ విశ్లేషణలో ఆర్ యొక్క ఉపయోగంపై దృష్టి సారించి బోధన, పరిశోధనలో అధ్యాపకుల నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు.గీతం మూడు ప్రాంగణాలలోని ఆర్థిక శాస్త్ర అధ్యాపకులు కలిసి పనిచేయాల్సిన అశ్యకతను ఈ సందర్భంగా వీసీ నొక్కి చెప్పారు. ఈ మూడు రోజుల ముఖాముఖి కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని అధ్యాపకులను ఆయన ప్రోత్సహించారు. ఈ అధ్యాపక వికాస కార్యక్రమ ప్రభావం, అంతిమంగా అధ్యాపకుల బోధన, పరిశోధనా కార్యకలాపాలలో ఎంత మేరకు జ్ఞానాన్ని పొందుతారనే దానిపై ఆధారపడి ఉంటుందని ప్రొఫెసర్ గౌతమరావు అన్నారు.

ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు సూచించారు.గీతం మూడు ప్రాంగణాలలో సాంఘిక శాస్త్ర సమస్యలను పరిష్కరించడానికి సంయుక్త సహకార ప్రయత్నాల అవసరాన్ని జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.సన్నీ జోష్, ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుత విద్యా ధోరణులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవడంపె దృష్టి పెట్టాలని ఆయన అధ్యాపకులను కోరారు. రానున్న రెండు మూడేళ్లలో అత్యుత్తను పరిశోధనా పత్రాలను ప్రచురించడంతో పాటు పరిశోధన కోసం పెద్ద మొత్తంలో నిధులను పొందే లక్ష్యంతో పరిశోధనా ఎజెండాను అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు.ఈ మూడు రోజుల ఎఫ్ డీ పీకి బిట్స్ హైదరాబాద్ లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ. భీమేశ్వర్రెడ్డి ప్రధాన వక్తగా వ్యవహరించనున్నారు. ఎకనామెట్రిక్స్ లో ఆర్ యొక్క వినియోగం ద్వారా ఈ ఎఫ్ డీ లో పాల్గొనేవారికి మార్గనిర్దేశనం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జీఎస్ఏహెచ్ఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నెల్సన్ మండేలా షణ్ముగం సమన్వయం చేశారు. శుక్రవారం వరకు ఈ కార్యక్రమం కొనసాగనున్నది.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago