– గ్రామస్తులు నగేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, రాములు గౌడ్
– రెండు కల్లు దుకాణాలకే అనుమతులు అక్రమంగా వెలిసిన ఐదు దుకాణాలు
– చెప్పిన పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రెండు దుకాణాలకే అనుమతులు ఉన్నప్పటికీ మరో ఐదు దుకాణాలలో కల్లు అక్రమంగా విక్రయిస్తున్నారని గ్రామస్తులు నాగేష్ గౌడ్, రాములు, ఆంజనేయులు గౌడ్ లు ఆరోపించారు. మంగళవారం మండలంలోని భానుర్ గ్రామంలో వారు మీడియాతో మాట్లాడుతు గ్రామంలో రెండు కల్లు దుకాణాలకు మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ గ్రామంలో విచ్చలవిడిగా కల్లు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వపరంగా రెండింటికే అనుమతులు ఉన్న ప్రభు గౌడ్, స్వామి గౌడ్, అనంతయ్య గౌడ్, నారాయణ గౌడ్, గంగయ్య గౌడ్ లు వెంకటేష్ గౌడ్ దగ్గర కల్లులు కొనుగోలు చేస్తూ గ్రామంలో విక్రయిస్తున్నారన్నారు. ఎన్నిసార్లు ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, అసలు మమ్ములను పట్టించుకోవడమే లేదని వారు ఆవేదనను వ్యక్తం చేశారు. దుకాణాలను వేరొక వ్యక్తి తమ గ్రామంలో కల్లు దుకాణాలను నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతూ మా పొట్ట కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే అక్రమంగా నిర్వహిస్తున్న దుకాణాలను మూసివేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…
దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…
జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…