Telangana

అక్రమ భూ సేకరణ పనులను వెంటనే నిలిపివేయాలి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ప్రభుత్వం చేపడుతున్న అక్రమ భూ సేకరణ పనులను వెంటనే నిలిపివేయాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పటాన్ చెరు మండలంలోని లక్డారం గ్రామంలో రైతులతో భూ సమస్య పైన కలిసి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూసర్వే నెంబర్ 498లో 22 ఎకరాల భూమిలో రెవెన్యూ వారి సహకారంతో పోలీసు యంత్రాంగం దౌర్జన్యంగా చేస్తున్న అక్రమ భూ సేకరణ పనులను వెంటనే నిలిపివేయాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గ్రామ రైతులకు 1970లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 25 మంది రైతులకు ఎక్కరా చొప్పున భూమి కేటాయించిందని గుర్తు చేశారు. ఎస్టిపి ప్లాంటు ఏర్పాటలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 10 ఎకరాలను కేటాయిస్తున్నామని చెప్పి, ఫెన్సింగ్ వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. గ్రామంలో ఎస్ టి పి ప్లాంటు ఏర్పాటు కోసం భూసేకరణ కోసం ఎ లాంటి నోటీసులు ఇవ్వకుండా, గ్రామసభ నిర్వహించకుండా, ఏ రకంగా భూమిలో ఫెన్సింగ్ వేస్తున్నారని ప్రశ్నించారు. రైతుల భూముల వద్ద వందలాది మంది పోలీసులతో ఫెన్సింగ్ వేయించడం, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ రైతుల విషయంలో ఇప్పటికే హైకోర్టులో కొనసాగుతుందని, ఈనెల 20వ తేదీన విచారణ ఉన్నదన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారము రైతుల వద్ద ప్రభుత్వ అవసరాల కోసం భూమి తీసుకుంటే భూమికి భూమి లేదా, నోటీసులు ఇచ్చి గ్రామసభ నిర్వహించి నష్టపరిహారం కోసం చర్చించవలసి ఉన్న, జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఇలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. అందుకోసం లక్డారం గ్రామ దళితుల భూ సమస్య పరిష్కారం కోసం రాజకీయ పార్టీలను, దళిత ప్రజా సంఘాలను పెద్ద ఎత్తున సమీకరించి గ్రామ రైతులకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు కే మల్లేష్, మాణిక్ ప్రభు, లక్ష్మయ్య, బలరాం, జీవన్ కుమార్, రవి, శ్రీనివాస్, వెంకటమ్మ, నవనీత, అంతమ్మ తదితర రైతులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago