Telangana

ఇంద్రేశంలో జోరుగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు

_తూతూ మంత్రంగా అక్రమ కట్టడం కూల్చివేత

– బిల్డర్లకు అండగా నిలుస్తున్న రాజకీయ నాయకులు

మనవార్తలు ,పటాన్‌చెరు:

సంగారెడ్డి జిల్లా లో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి . రాజధాని హైదరాబాద్ కు అతి దగ్గరలో ఉండడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇళ్ళు ,భవనాలు ,షెడ్లను అక్రమంగా నిర్మిస్తున్నారు. అధికారులు సైతం తూతూమంత్రంగా కొన్ని అక్రమ నిర్మాణాలను, కట్టడాలను కూల్చివేసి చేతులు దులుపుకుంటున్నారు.వివరాల్లోకి వెళ్తే అక్రమ కట్టడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అక్రమ కట్టడాల‌ను నిలువరించాల్సిన క్షేత్రస్థాయి అధికారులకు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు అధికమవడంతో చేసేదేమి లేక చేతులెత్తేస్తున్నారు.

జిల్లా అధికార యంత్రాంగం అక్రమ కట్టడాలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఒక న్యాయం. పెద్దలకు ఒక న్యాయామా అని బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశంలో జరుగుతున్న అక్రమ‌ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శనివారం కూల్చివేతలు జరిగాయి. ఈ కూల్చివేతలు‌ కూడా నామమాత్రంగా జరిగాయి. ఇంద్రేశం పంచాయతీ కార్యదర్శి సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం  ఇంద్రేశం గ్రామ పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన సమాచారం మేరకు కూల్చివేతలు జరిపినట్టు తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవని ఆయన హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని చెప్పారు. కొనుగొలుదారులు కూడా ప్రభుత్వ నిబంధనలతో నిర్మించిన అపార్ట్మెంట్ లలో ఫ్లాట్లు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు…

అదేవిధంగా బిల్డర్లకు, అక్రమ నిర్మాణదారులకు స్థానిక ప్రజాప్రతినిధులు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనితో ప్రభుత్వ పరమైన, అధికారికంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి.  ఏది ఏమైనా ప్రభుత్వ నిబంధనలకు లోబడి అపార్ట్‌మెంట్ నిర్మాణాలు చేపట్టి అటు వినియోగదారులకు, ఇటు కొనుగోలు చేసే వ్యక్తులకు అన్ని విధాలుగా సేఫ్ సైడ్ లో ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఈ అక్రమ నిర్మాణాలను జిల్లా అధికారులు ఏ మేరకు నియంత్రిస్తారో వేచి చూడాల్సిందే.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago