మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ )
ఏదైనా అనుకోని కష్టం ఎదురెనప్పుడు కుటుంబ సభ్యులు , ఆప్తులు , అధ్యాపకులతో పంచుకోవాలని లేదా సమీప సఖి కేంద్రాన్ని సంప్రదించాలని సంగారెడ్డిలోని సఖి కేంద్రం ఇన్ఛార్జి కల్పన , న్యాయవాది నీలిమలు గీతం విద్యార్థులకు సూచించారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎస్వేచ్ఎస్ ) , గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ( జీఎస్ఓ ) లు బుధవారం సంయుక్తంగా నిర్వహించిన ‘ సెబర్ క్రైమ్స్ – విద్యార్థులపై దాని ప్రభావం ‘ అనే అంశంపై వారు ఆతిథ్య ఉపన్యాసం చేశారు . – సెబర్ క్రైమ్ నేరానికి ఇంటర్నెట్ కనెక్షన్ లేదా కంప్యూటర్ను సాధనంగా ఉపయోగిస్తారని చెప్పారు . సెబర్ నేరాలను ఆర్థిక , గోప్యత , హ్యాకింగ్ , సెబర్ టెర్రరిజంగా వారు వర్గీకరించారు . సెబర్ క్రైమ్ ను అరికట్టి , ప్రజా ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందించిందన్నారు .
చట్టం ముందు స్త్రీ – పురుష భేధం ఉండదని , అంతా సమానమేనని , నేరం రుజువెత్తే శిక్ష అనుభవించక తప్పదని , సాక్ష్యాల రుజువుకే తీర్పు వెలువరించడంలో జాప్యం జరుగుతోందని వారు స్పష్టీకరించారు . ఫేస్బుక్ అప్డేట్లు వీలయినంత తగ్గించుకోవడం మంచిదని , ముఖ్యంగా విచారకర అంశాలను అసలు షేర్ చేయొద్దని , దానిని మరొకరు అవకాశంగా మలచుకొని మనపై అదుపు సాధించొచ్చని వారు హెచ్చరించారు . అలాగే మెనర్లు వాహనాలు నడపడం , తాగి డ్రైవ్ చేయడం , హెల్మెట్ ధరించకపోవడం వంటివన్నీ శిక్షార్హమైనవేనని , అయితే మెనర్ల పట్ల కొంత సానుభూతితో వ్యవహరించినా , తిరిగి తప్పుచేస్తే మాత్రం చాలా కఠిన శిక్షలు ఉంటాయని కల్పన , నీలిమ పేర్కొన్నారు .
ఒకసారి శిక్ష పడ్డాక ప్రభుత్వ ఉద్యోగం లేదా విదేశీ వీసా పొందడం అంత సులువు కాదన్నారు . వీలయినంత వరకు నేరపూరిత చర్యలకు పాల్పడకపోవడమే శ్రేయోదాయకమని స్పష్టీకరించారు . సఖి ఏర్పాటు , దాని పనితీరు , పరిష్కరించిన కేసుల వివరాలు వంటివి వారు విద్యార్థులకు వివరించారు . వారు సంధించిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు . తొలుత , గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి అతిథులను స్వాగతించి , సత్కరించారు . డాక్టర్ సురేష్ కుమార్ దిగుమర్తి , డాక్టర్ దివ్య కీర్తి గుప్తాలు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…