పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ఆకర్షణీయమైన ప్యాకేజీలతో నుంచి ఉద్యోగాలను పొందాలంటే అందుకు అవసరమైన నెఫుణ్యాలను అలవరచుకోవడం అవశ్యమని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య స్పష్టీకరించారు. గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ (జీసీజీసీ) ఆధ్వర్యంలో ‘స్కిల్ బిల్డింగ్ అండ్ కెరీర్ ఫుల్ఫిల్మెంట్’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆరో సెమిస్టర్లో ఉన్న విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని, అన్ని శిక్షణా తరగతులకు విద్యార్థులంతా క్రమం తప్పకుండా హాజరు కావాలని కోరారు. వచ్చే ఏడాది వంద శాతం ప్రాంగణ నియామకాలు సాధించాలనే లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఉన్నత చదువులైనా , లేదా ప్రాంగణ నియామకాలైనా , విద్యార్థులకు ఇష్టమైనై కెరీర్ మార్గాన్ని ఓ స్పష్టతతో ఎంపిక చేసుకుని, అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకు సాగాలని సీజీసీ హెదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ స్పష్టీకరించారు. విద్యార్థి అభిరుచికి అనుగుణంగా తగు మార్గదర్శనం చేసే సిబ్బంది కెరీర్ గైడెన్స్ కేంద్రంలో అందుబాటులో ఉంటారని చెబుతూ, తమ విభాగం నిర్మాణం, బాధ్యతలను వివరించారు.
ఈ ఏడాది ఇప్పటివరకు 66 కంపెనీలు గీతంలో ప్రాంగణ నియామకాలు చేపట్టగా, కేవలం 50 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఎంపికయ్యారని, గరిష్ట వార్షిక వేతనాలు ఇవ్వజూపిన దాదాపు పది-పన్నెండు కంపెనీలకు ఒక్కరు కూడా ఎంపిక కాలేదని ఆయన విచారం వెలిబుచ్చారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మెరుగైన నైపుణ్యాలను అలవరచుకోవాలని సూచించారు. ప్రతి సెమిస్టర్ లో 30 గంటల కెరీర్ గైడెన్స్ శిక్షణ ఉంటుందని, దీనికి అదనంగా 6, 7 సెమిస్టర్లలో 30 గంటల ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ప్రతిభకనబరచిన 600 నుందిని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు, మిగిలిన వారు సర్వీస్ బేస్డ్ కంపెనీలలో ఉద్యోగాలు పొందేలా తర్ఫీదు ఇస్తామని డిప్యూటీ డైరెక్టర్ (నెపుణ్యాభివృద్ధి) డాక్టర్ సురేష్, వివరించారు. ఏయే మాడ్యూల్లో ఎటువంటి శిక్షణ ఇస్తారో ఆయన విడమరిచి చెప్పారు.
గీతం వెబ్ సైట్ ద్వారా ప్రాంగణ నియామకాల కోసం పేర్లు నమోదు చేసుకోవడం, ఆన్లైన్లో రుసుము చెల్లించే విధానాలను శిక్షణాధికారి బి. సంతోష్ కుమార్ తెలియజేశారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…