Telangana

జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు తెచ్చిన పారా-అథ్లెట్లను ఘనంగా సత్కరించిన హైదరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ శ్రీ సి.వి.ఆనంద్‌

_సిమ్లా నుండి మనాలి వరకు జరిగే ఇన్ఫెనిటి రైడ్‌‘‘22లో పాల్గొంటున్న లక్ష్మీ మంచు & రెజీనా కసండ్రా

మనవార్తలు ,హైదరాబాద్:

భారతదేశానికి మరియు ఎఎమ్‌ఎఫ్‌కు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు తెచ్చిన పారా-అథ్లెట్లను ఘనంగా సత్కరించిన హైదరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌  సి.వి.ఆనంద్‌ ,శారీరక వైకల్యానికి గురైన వ్యక్తులు క్రీడా వృత్తిని ఎంచుకునేలా సహాయం చేయడంతోపాటు వారికి స్వీయ-పోషణను అందిస్తున్న లాభాపేక్ష లేని సంస్థ అయిన ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ (ఎఎమ్‌ఎఫ్‌), పారా`అథ్లెట్లు ఎఎమ్‌ఎఫ్‌లో శిక్షణ తీసుకున్న తరువాత జాతీయంగా మరియు అంతర్జాతీయంగా పతకాలను సాధించి తద్వారా దేశానికి కీర్తి ప్రతిష్టలను సంపాదించినవారిని గౌరివించేందుకు ఎఎమ్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో 11వ ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ ప్రజెంటేషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌ ఉత్సవం ఈ రోజు జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌, పోలీస్‌ కమీషనర్‌,  సి.వి. ఆనంద్‌ ముఖ్య అతిథిగా హాజరై దేశం మరియు ఎఎమ్‌ఎఫ్‌ను గర్వపడేలా చేసిన పారా`అథ్లెట్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఎఎమ్‌ఎఫ్‌ మెంటర్‌ & నటి,  లక్ష్మి మంచు; తెలంగాణ మాజీ ముఖ్య కార్యదర్శి & ఎఎమ్‌ఎఫ్‌, ట్రస్టీ  ఎస్‌కె జోషి ; సిఆర్‌పిఎఫ్‌, మాజీ డిజి మరియు ఎఎమ్‌ఎఫ్‌, మెంటర్‌, కె.దుర్గా ప్రసాద్‌ ; ట్రస్టీ ఎఎమ్‌ఎఫ్‌ & బాహుబలి సినిమా నిర్మాత & ఆర్కా మీడియా సిఇఒ, శోభు యార్లగడ్డ; ఎఎమ్‌ఎఫ్‌ ట్రస్టీ & నటి, ఫిలాంత్రపిస్ట్‌, కుమారి రెజీనా కసండ్రా ; ట్రస్టీ ఎఎమ్‌ఎఫ్‌ & మాజీ మిసెస్‌ ఇండియా & ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమతి శిల్పా రెడ్డి లు హాజరైనారు. ఈ సందర్బంగా ఇన్ఫినిటి రైడ్‌‘‘2022 పోస్టర్‌ను ప్రముఖులు ఆవిష్కరించి ఎఎమ్‌ఎఫ్‌ సహకారాన్ని అందుకుంటున్న అథ్లెట్లకు 80 లక్షల రూపాయాలకు పైగా విలువచేసే ఉపకరణాలను పంపిణీ చేశారు.

ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ (ఎఎమ్‌ఎఫ్‌) గురించి:

పారా స్పోర్ట్స్‌ ప్రపంచంలో భారత్‌ను సూపర్‌ పవర్‌గా మార్చడమే మా లక్ష్యం. ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ (ఎఎమ్‌ఎఫ్‌) అనేది ఒక లాభాపేక్ష లేని సంస్థ, ఇది వైకల్యాలున్న వ్యక్తులకు క్రీడా వృత్తిని కొనసాగించేందుకు సహాయం చేస్తుంది మరియు వారికి స్వీయ-పోషణను అందిస్తుంది. 2013లో ప్రారంభమైన ఈ ఫౌండేషన్‌ అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగింది. హైదరాబాద్‌లో ఉన్న ఈ ఫౌండేషన్‌ వాస్తవంగా దేశంలోని ప్రతి మూలకు విస్తరించి, భారతదేశానికి పతకాలు గెలుస్తున్న పారా ఛాంపియన్‌లను రూపొందించడంలో దోహదపడిరది. ఇది ఒక ప్రత్యేక కారణాన్ని సూచిస్తుంది మరియు చాలా పెద్ద జనాభాలో నిర్లక్ష్యం చేయబడిన భాగానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది.

ఇన్ఫినిటీ రైడ్‌ గురించి:

ఎఎమ్‌ఎఫ్‌కు ప్రత్యేకమైన ఫండ్‌-రైజింగ్‌ ఈవెంట్‌, ఇన్ఫినిటీ రైడ్‌ ద్వారా నిధులను సేకరిస్తుంది మరియు వికలాంగుల జనాభాలో ప్రతిభను స్కౌట్‌ చేస్తుంది మరియు అట్టడుగు స్థాయి నుండి వారికి శిక్షణ ఇస్తుంది. సేకరించిన డబ్బుతో, ఇది కౌన్సెలింగ్‌ను కూడా అందిస్తుంది మరియు వారి క్రీడలో మెరుగ్గా ఉండటానికి లేదా వారికి సరిపోయే క్రీడను కనుగొనడంలో సహాయపడుతుంది. ఇది ఈ క్రీడాకారులకు అవసరమైన పరికరాలు, శిక్షణ మరియు నిధులను అందజేస్తుంది, అలాగే వారు తమ క్రీడలో ఎదగడానికి మరియు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వారికి సహాయపడుతుంది. పౌర ప్రతిభతో పాటు, ఫౌండేషన్‌ యొక్క ప్రయత్నాలలో ప్రధాన భాగం దేశంలోని సెంట్రల్‌ ఆర్మ్డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బిఎస్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌ మరియు ఐటిబిపి) నుండి ప్రతిభను కనుగొనడం మరియు పెంపొందించడంపై నిర్దేశించబడిరది, ఇందులో అనేక మంది సైనికులు ఉన్నారు. సరిహద్దు వద్ద లేదా నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలలో ఉన్న దేశం మరియు ఇప్పుడు 2024 పారాలింపిక్స్‌కు సంభావ్య ప్రతిభావంతులుగా మారడానికి శిక్షణ పొందుతున్నారు.
మరింత సమాచారానికి దయ చేసి సంప్రదించండి: 9959154371 / 9963980259

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago