Telangana

ఫుడ్ సైన్స్ లో అపార అవకాశాల…

– గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన ప్రొఫెసర్ విజయా ఖాదర్

మనవార్తలు ,పటాన్ చెరు:

ఫుడ్ సెన్ట్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలున్నాయని , విద్యార్థుల అభిరుచికి తగ్గ విభాగాన్ని ఎంపిక చేసుకుని రాణించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం , హోమ్ సెన్ట్స్ పూర్వ డీన్ ప్రొఫెసర్ విజయ ఖాదర్ అన్నారు . ‘ కనెక్ట్ ‘ ఉపన్యాసాల పరంపరలో భాగంగా , గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ , డెరైక్టరేట్ ఆఫ్ ఎక్స్టెర్నల్ రిలేషన్స్ శుక్రవారం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఆతిథ్య ఉపన్యాసం చేశారు . విద్యార్థుల కెరీర్ను ఎలా మలచుకోవాలి , పరిశోధనావకాశాలు , ఔషధ , రసాయన పరిశ్రమలలో ఫుడ్ సెన్స్ , టెక్నాలజీ నెపుణ్యాలను ఎలా అన్వయిస్తారు అనే అంశాలపై ఆమె ప్రధానంగా దృష్టి సారించారు . తాను హోమ్ సెన్స్డ్ బోధించేటప్పుడు ‘ వండుకోని , తినేదేగా ‘ అని తోటి అధ్యాపకులే చులకన చేసిన సందర్భాలు ఉన్నాయని , తాను ఎంపిక చేసుకున్న రంగంలో ఇష్టంగా పనిచేయడం . ద్వారా రెండు మేథోహక్కులు , 86 పరిశోధనా పత్రాలు , ఆరు విశ్వవిద్యాలయ స్థాయి పాఠ్యాంశ పుస్తకాలు , 22 పరిశోధనా ప్రాజెక్టులను చేపట్టి , ఎన్నో అవార్డులు , రివార్డులను పొందినట్టు విద్యార్థుల హర్షధ్వానాల డాక్టర్ విజయ సగర్వంగా ప్రకటించారు .

ఫుడ్ సె భద్రత , నాణ్యత నియంత్రణ , ఉత్పత్తుల అభివృద్ధి వంటి పలు విభాగాలున్నాయని , ఆయా విద్యార్థుల నేపథ్యం , అభిరుచికి తగ్గవాటిని ఎంపిక చేసుకుని రాణించాలని ఆమె సూచించారు . ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువగానే ఉన్నాయని , వృత్తిలో నెపుణ్యం సాధించిన వారికి విశ్వవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఓ ప్రశ్నకు ఆమె బదులిచ్చారు . తెలివిగా ఆలోచించగలిగితే ఈ రంగంలో స్వయం ఉపాధి చేపట్టి సులువుగా రాణించవచ్చని డాక్టర్ విజయా ఖాదర్ స్పష్టీకరించారు . పూర్వకాలంలో ఇళ్ళలో చేసుకునే ఉలవచారు ఈ రోజు ఐదు నక్షత్రాల హోటళ్ళు , ప్రతిష్ఠాత్మక పెళ్లిళ్లలో మెనూగా మారిందని , అలాగే పాలతాళికలు , కొబ్బరి / రాగి ఉండలు అని ఆమె వివరించారు . ఫుడ్ ప్రాసెసింగ్ లేక దాదాపు 30 శాతం వ్యవసాయ ఉత్పత్తులు ప్రతియేటా వృథాగా పోతున్నాయని , అంటే రమారమి రూ .580 కోట్ల విలువైనవని , అవి 23 కోట్ల మంది క్షుద్బాధను తీర్చగలవని చెప్పారు .

గ్రామీణ ప్రాంతాలలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా అటు ఉత్పత్తుల వృథాను అరికట్టడమే గాక ఉపాధి అవకాశాలు , మహిళా సాధికారతను కల్పించవచ్చని డాక్టర్ విజయా ఖాదర్ పేర్కొన్నారు . ఫుడ్ సెన్ట్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిసతి ప్రొఫెసర్ ఉమామహేశ్వరి స్వాగతోపన్యాసం చేయగా , కెరీర్ గెడైన్స్ సెల్కు చెందిన కెరియల్ ఫుల్ఫిల్మెంట్ అధికారి డాక్టర్ రమాకాంత్ బాల్ వందన సమర్పణ చేశారు . డాక్టర్ అజయ్ కుమార్ స్వర్ణాకర్ , డాక్టర్ జి.నిహారిక , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు ఈ ఆతిథ్య ఉపన్యాసంలో పాల్గొన్నారు .

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

11 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

11 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

11 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

11 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

11 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago