Telangana

వ్యవసాయ యాంత్రీకరణతో అధిక ఉత్పత్తులు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

64 మందు రైతులకు 20 లక్షల రూపాయల సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఆధునిక వ్యవసాయంలో వ్యవసాయ యాంత్రీకరణ కీలకపాత్ర పోషిస్తుందని.. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీతో వ్యవసాయ యాంత్రికరణ పరికరాలు అందిస్తుందని  ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రైతులకు సబ్సిడీ పైన మంజూరైన వివిధ రకాల వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను శనివారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో సాంప్రదాయ పద్ధతులతో వ్యవసాయం చేయడం మూలంగా తక్కువ దిగుబడితోపాటు అధిక ఖర్చు మూలంగా రైతు నష్టపోతున్నారని తెలిపారు. కృత్రిమ మేదస్సు ద్వారా తయారైన యంత్రాలు వాడకం ద్వారా సాగు వ్యయం తగ్గడంతో పాటు ఉత్పత్తుల పెరుగుతున్నాయని తెలిపారు. ప్రతి యంత్ర పరికరం పై ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా 64 మంది రైతులకు 20 లక్షల రూపాయల సబ్సిడీతో 27 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో వెలిమల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ బుచ్చిరెడ్డి, వ్యవసాయ శాఖ ఏడి మనోహర, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

16 hours ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

16 hours ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

16 hours ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

16 hours ago

నూతన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించండి

అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…

1 day ago

ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…

2 days ago