పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 305 చర్చిలకు ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత నిధులతో కేకులను పంపిణీ చేశారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి చర్చి పాస్టర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి క్రిస్మస్ సందర్భంగా అన్ని చర్చిలకు కేకులను పంపించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని నిరుపేద క్రిస్టియన్ల కోసం క్రిస్మస్ కానుకలు పంపిణీ చేస్తున్నదని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంగా వీటిని పంపిణీ చేసినట్లు తెలిపారు.అనంతరం నియోజకవర్గ పరిధిలోని క్రిస్టియన్ల సంక్షేమం కోసం 10 లక్షల రూపాయల సొంత నిధులను పాస్టర్ల సంఘానికి అందజేశారు. ఆపదలో ఉన్న క్రిస్టియన్ల సంక్షేమానికి వీటిని వినియోగించాలని కోరారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సోమిరెడ్డి, పరమేష్ యాదవ్, అఫ్జల్, బాబ్జి, బండి శంకర్, పాస్టర్ల సంఘం అధ్యక్షులు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…