-ఆతిథ్య ఉపన్యాసంలో గ్రామనర్ లీడ్ డేటా సెంటిస్ట్ ప్రవీణ్ కుమార్
పటాన్ చెరు:
వ్యాపార సమస్యను నిర్వచించడం , తగిన మోడళ్ళను ఎంచుకోవడం , పనితీరు కొలమానాలను ఉపయోగించి మూల్యాంకనం చేయడం , పరీక్షించిన మోడళ్ళతో పరిష్కారాలను రూపొందించడం వంటి వివిధ దశలలో డేటా అనలిటిక్స్ ప్రాధాన్యం పెరుగుతోందని గ్రామనర్ లీడ్ డేటా సెంటిస్ట్ ప్రవీణ్ కుమార్ వాసరి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్లోని డేటా సెన్స్ విద్యార్థులకు ఆచరణాత్మక విద్యను అందజేయాలనే లక్ష్యంతో పారిశ్రామిక నిపుణులతో నిర్వహిస్తున్న ముఖాముఖిలో భాగంగా బుధవారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు .
రోజువారీ వ్యాపార లావాదేవీలతో సమకూరుతున్న డేటాను విశ్లేషించి తగిన సూచనలు చేసే విధానాల గురించి ఆయన విడమరిచి చెప్పారు . తొలుత గణిత శాస్త్ర సీనియర్ అధ్యాపకుడు ప్రొఫెసర్ బీ.ఎం. నాయుడు అతిథిని విద్యార్థులకు పరిచయం చేశారు . డేటా సెన్స్కు పెరుగుతున్న ప్రాధాన్యతను ఆయన విద్యార్థులకు వివరిస్తూ , ఆ రంగ నిపుణుడితో ఏర్పాటు చేసిన ముఖాముఖిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . ఈ కార్యక్రమంలో గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా , అధ్యాపకులు డాక్టర్ శివారెడ్డి శేరి , డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డితో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…