-ఆతిథ్య ఉపన్యాసంలో గ్రామనర్ లీడ్ డేటా సెంటిస్ట్ ప్రవీణ్ కుమార్
పటాన్ చెరు:
వ్యాపార సమస్యను నిర్వచించడం , తగిన మోడళ్ళను ఎంచుకోవడం , పనితీరు కొలమానాలను ఉపయోగించి మూల్యాంకనం చేయడం , పరీక్షించిన మోడళ్ళతో పరిష్కారాలను రూపొందించడం వంటి వివిధ దశలలో డేటా అనలిటిక్స్ ప్రాధాన్యం పెరుగుతోందని గ్రామనర్ లీడ్ డేటా సెంటిస్ట్ ప్రవీణ్ కుమార్ వాసరి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్లోని డేటా సెన్స్ విద్యార్థులకు ఆచరణాత్మక విద్యను అందజేయాలనే లక్ష్యంతో పారిశ్రామిక నిపుణులతో నిర్వహిస్తున్న ముఖాముఖిలో భాగంగా బుధవారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు .
రోజువారీ వ్యాపార లావాదేవీలతో సమకూరుతున్న డేటాను విశ్లేషించి తగిన సూచనలు చేసే విధానాల గురించి ఆయన విడమరిచి చెప్పారు . తొలుత గణిత శాస్త్ర సీనియర్ అధ్యాపకుడు ప్రొఫెసర్ బీ.ఎం. నాయుడు అతిథిని విద్యార్థులకు పరిచయం చేశారు . డేటా సెన్స్కు పెరుగుతున్న ప్రాధాన్యతను ఆయన విద్యార్థులకు వివరిస్తూ , ఆ రంగ నిపుణుడితో ఏర్పాటు చేసిన ముఖాముఖిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . ఈ కార్యక్రమంలో గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా , అధ్యాపకులు డాక్టర్ శివారెడ్డి శేరి , డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డితో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు .
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…