Districts

గొప్ప అభ్యుదయ వాది మహాత్మా బసవేశ్వరుడు_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_పటాన్చెరులో ఘనంగా బసవ జయంతి

_త్వరలో బీరంగూడ లో బసవేశ్వర కాంస్య విగ్రహ ఏర్పాటు

మనవార్తలు ,పటాన్ చెరు 

12వ శతాబ్దం లోనే కుల మత వర్గ రహిత సమాజం కోసం అనుభవ మంటపం ఏర్పాటుచేసిన గొప్ప అభ్యుదయ వాది, విశ్వ గురు మహాత్మా బసవేశ్వరుడు అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బసవేశ్వరుడి 889 వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని అశ్వారూఢ బసవేశ్వరుని విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీరంగూడ కమాన్ వద్ద 20 లక్షల రూపాయల వ్యయంతో అశ్వారూఢ బసవేశ్వరుడి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో లింగాయత్ సమాజం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాయకమే కైలాసం, దేహమే దేవాలయం, భక్తి కన్నా సత్ప్రవర్తన ముఖ్యం అంటూ చేసిన బోధనలు నేటి తరానికి అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బసవేశ్వర్, విజయ్ కుమార్, చంద్ర శేకర్ రెడ్డి, లింగాయత్ సమాజం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago