_పటాన్చెరులో ఘనంగా బసవ జయంతి
_త్వరలో బీరంగూడ లో బసవేశ్వర కాంస్య విగ్రహ ఏర్పాటు
మనవార్తలు ,పటాన్ చెరు
12వ శతాబ్దం లోనే కుల మత వర్గ రహిత సమాజం కోసం అనుభవ మంటపం ఏర్పాటుచేసిన గొప్ప అభ్యుదయ వాది, విశ్వ గురు మహాత్మా బసవేశ్వరుడు అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బసవేశ్వరుడి 889 వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని అశ్వారూఢ బసవేశ్వరుని విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీరంగూడ కమాన్ వద్ద 20 లక్షల రూపాయల వ్యయంతో అశ్వారూఢ బసవేశ్వరుడి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో లింగాయత్ సమాజం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాయకమే కైలాసం, దేహమే దేవాలయం, భక్తి కన్నా సత్ప్రవర్తన ముఖ్యం అంటూ చేసిన బోధనలు నేటి తరానికి అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బసవేశ్వర్, విజయ్ కుమార్, చంద్ర శేకర్ రెడ్డి, లింగాయత్ సమాజం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…